News In Pics: చిత్రం చెప్పే సంగతులు(13-12-2023)
Updated : 13 Dec 2023 03:51 IST
1/15
హైదరాబాద్: షేక్పేట గుట్టపోచమ్మ దేవాయంలో కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో భక్తులు వందల దీపాలు శివలింగం, పూల ఆకారాల్లో వెలిగించగా ఆలయంలో శివలింగం దీపాల ముగ్గులా కనిపించింది. కార్యక్రమంలో కథక్ నృత్య కళాకారుడు నటేశ్వలింగం పాల్గొన్నారు.
2/15
హైదరాబాద్: జేఎన్టీయూ వంతెన ప్రహరీపై ఓ మొక్క పెరుగుతోంది. శ్లాబు నుంచి పెరుగుతున్న ఈ మొక్క ప్రహరీ వరకు పాకింది. ఈ మొక్క.. భారీ వృక్షంగా మారి ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
3/15
హైదరాబాద్: ఎస్సార్నగర్ బచ్పన్ ప్లే స్కూల్లో మంగళవారం అంతర్గత పాఠశాలల క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. వివిధ రకాల క్రీడలతో పాటు షో అండ్ టెల్, క్విజ్, డ్యాన్స్ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
4/15
మెదక్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి. డిసెంబరు వచ్చిందంటే చాలు ఇక్కడ క్రిస్మస్ సందడి షురూ అవుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు జన్మంచిన స్థలం జెరూసలెంలోని బెత్లహం నమూనాను వెస్లీ బాలుర వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థులు రూపొందించారు.
5/15
వరంగల్: కార్తికమాసం మంగళవారం అమావాస్య తిథి సందర్భంగా హనుమకొండలో పద్మాక్షి కాలనీలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరమశివుడిని 51 కిలోల ఉసిరి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
6/15
మెదక్: వాన జల్లు పడి వెలసిన తర్వాత రోడ్డుపై ఏర్పడిన నీటి చారికలు కావివి. సిద్దిపేట బైపాస్ రోడ్డు నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సూర్య కిరణాలు పడి చూపరులకు దూరం నుంచి భ్రాంతి కలిగేలా ఏర్పడి, కెమెరాకు చిక్కిన ఎండమావులు అవి.
7/15
ఆదిలాబాద్: రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఉదయం 10 గంటల వరకు పొగమంచు అలాగే ఉంటోంది. తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలెవరూ బయటకు రాలేకపోతున్నారు.
8/15
విశాఖపట్నం: స్థానిక ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు మంగళవారం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. నృత్యాలు ఆకట్టుకున్నాయి.
9/15
అనంతపురం నగరానికి చెందిన డిస్కోబాబు (రహ్మతుల్లా) హరియాణా నుంచి 1950వ దశకానికి చెందిన కారును కొనుగోలు చేశారు. పెళ్లయిన వారికి తీపి జ్ఞాపకంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
10/15
చిత్తూరు: కార్తిక అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం స్వర్ణమ్మ హారతుల కార్యక్రమం అద్భుతంగా జరిగింది. స్వర్ణముఖి నది తీరంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
11/15
పార్వతీపురం: పైడితల్లి సిరిమానోత్సవం ముగింపులో భాగంగా చదురుగుడి ప్రాంగణంలో మహాన్నదాన కార్యక్రమం మంగళవారం జరిగింది.సుమారు 12 వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించారు.
12/15
అమరావతి: కార్తిక మాసం ముగింపులో భాగంగా మంగళవారం సాయంత్రం నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం వెలిగిపోయింది. 60 కేజీల నూనెతో 18 కేజీల బరువు 3.5 అడుగుల ఎత్తు గల దీపం వెలిగించి కృష్ణానదిలో వదిలారు.
13/15
గుంటూరు: నంబూరులోని వీవీఐటీలో జరుగుతున్న బాలోత్సవ్ వేడుకలు రెండో రోజు మంగళవారం ఉత్సాహంగా సాగాయి..చిత్ర, విచిత్ర వేషధారణలు, జానపద, కూచిపూడి నృత్యాలు అలరించాయి.
14/15
గుంటూరు: ఈ బాలిక నాలుగేళ్లుగా బాలోత్సవ్లో విభిన్న వేషధారణలతో అందరినీ ఆలోచింపజేస్తోంది.ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూలుకు చెందిన క్రిషి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాలోత్సవాల్లో విభిన్న ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది.
15/15
హైదరాబాద్: కోతల అనంతరం ధాన్యాన్ని ఔటర్ రింగురోడ్డు సర్వీసు రహదారిపై పెద్ద ఎత్తున ఆరబోస్తున్నారు. ధాన్యం పక్కన పెద్ద బండరాళ్లు ఉంచుతున్నారు. రహదారిపై బండరాళ్లను గమనించని ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!