News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (25-05-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 25 May 2024 09:57 IST
1/21
![విశాఖ జిల్లా ఎన్ఏడీ కూడలి వద్ద సింహాచలం కొండల మీదుగా నాలుగు గంటల సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వేసవి వేడి గాలులకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం దక్కింది. అయితే...వర్షం కురుస్తుందని ఆశించినా... వరుణుడు కరుణించలేదు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal20.jpg)
2/21
![బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. సముద్రంలోని అలలు తీరానికి సమీపంగా రావటంతో ఎండల నుంచి ఉపశమనం పొందేలా పలువురు స్నానాలు చేస్తూ సందడి చేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal19.jpg)
3/21
![విశాఖ జిల్లా రుషికొండ బీచ్రోడ్డులోని ఒక హోటల్ సమీపంలో పనస చెట్టు విరగకాసింది. ఈ చెట్టుకు పనసకాయలు అధికంగా కనిపిస్తుండడంతో స్థానికులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal18.jpg)
4/21
![చీపురు పుల్లలా, ఎండుటాకులా కనిపిస్తున్న ఈ కీటకం చెట్టు బెరడు రంగులో కలిసిపోయిది. పరిశీలనగా చూస్తే తప్ప అదో కీటకమని గుర్తించలేం. విశాఖ జిల్లా చీడికాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న బాదం చెట్టుపై పాకుతుండగా ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది. దీన్ని గొల్లభామగా పిలుస్తారని స్థానికులు పేర్కొన్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal17.jpg)
5/21
![జామకాయలు సహజంగా వంద నుంచి 150 గ్రాముల మధ్యన బరువుంటాయి. విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ దుకాణదారుడు తన బండిపై విక్రయానికి తెచ్చిన కాయల్లో కొన్ని చాలా భారీ సైజులో ఉన్నాయి. ఇవి ఒకొక్కటి అర కేజీకిపైగా తూగడం విశేషం.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal16.jpg)
6/21
![చూసే కళ్లు, స్పందించే హృదయం ఉండాలే కానీ అల్లూరి జిల్లాలో సహజసిద్ధ అందాలకు కొదవలేదు. ఏ చిత్రకారుడో తన కుంచెతో గీసినట్లు ఉన్న ఈ దృశ్యం విశాఖ జిల్లా చింతపల్లి- నర్సీపట్నం మార్గంలోని లోతుగెడ్డ కూడలి సమీపంలో ‘న్యూస్టుడే’ కెమెరాకు చిక్కింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal15.jpg)
7/21
![వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం కేశవపల్లిలో వ్యవసాయ బావులు అధికంగా ఉన్నాయి. రాతి కట్టడాలతో ఆకట్టుకుంటున్నాయి. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో విద్యార్థులు ఈత కొడుతున్నారు. ఎండలు మండుతుండడంతో గంటల తరబడి జలకాలాటలతో సేదదీరుతున్నారు](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal14.jpg)
8/21
![నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం(గోదావరి, మంజీరా, హరిద్ర) వద్ద గోదావరి నది పరిస్థితి ఇది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేక గోదావరి ఖాళీ అయ్యి ఇసుక మేటలు బయటపడ్డాయి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal13.jpg)
9/21
![చిత్రంలో కన్పిస్తున్నవి మల్బరీ బెర్రీ పండ్లు. అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు నుంచి కేశప్పగూడెం వెళ్లే మార్గంలోని రైతు కంచర్ల భాస్కరరావు తోటలోని చెట్టుకు కాసిన పండ్లు ఇవి. పట్టుపురుగుల మల్బరీ చెట్టుకు సంబంధించిన జాతిలో ఒక రకమైన మొక్క ఇది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal12.jpg)
10/21
![ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ యువకుడు ఉన్నితో చేసిన శిరస్త్రాణం ధరించి స్థానిక రహదారులపై కనిపించాడు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal11.jpg)
11/21
![కారును కడగడానికి పైపు ఏర్పాటు చేశారని అనుకుంటే పొరపాటే. కరీంనగర్ కమాన్ సమీపంలోని హౌసింగ్బోర్డు రోడ్డులో పబ్లిక్ కుళాయి పగిలి.. ఇలా నీరు విరజిమ్మింది. పక్కనే కారు నిలిపి ఉంచడంతో ఆ నీరు దానిపై పడింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal10.jpg)
12/21
![ఎండల తీవ్రతను తట్టుకోవటానికి పలువురు ఆటోల్లో, లారీల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. వీటి వల్ల వేడి గాలి వస్తోందని భావించిన కొందరు లారీ డ్రైవర్లు సరికొత్తగా లారీ క్యాబిన్లలో కూలర్లను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal9.jpg)
13/21
![‘శక్తి’ పథకానికి వినియోగిస్తున్న బస్సుల్లో ఎక్కువ శాతం మరమ్మతుల పాలయ్యాయి. కొన్ని బస్సుల పైకప్పులకు రంధ్రాలు పడ్డాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు ఇలా గొడుగు వేసుకుని ఆర్టీసీ డ్రైవరు బస్సు నడిపారు. ఈశాన్య కర్ణాటక విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal8.jpg)
14/21
![కన్నియాకుమరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు తిర్పరప్పు జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకులు స్నానం చేసేందుకు నిషేధం విధించారు](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal7.jpg)
15/21
![తీగల వంతెనపై నెలక్రితం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. రెండురోజులు హడావుడి చేసిన పోలీసులు అటువైపు చూడడం మానేశారు. దీంతో ఎప్పటిలాగే వంతెనపై వాహనాలు నిలిపి ఫొటోలు దిగడం, బర్త్ డే వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal6.jpg)
16/21
![హైదరాబాద్లోని లుంబినీ పార్కులోని జలపాతంలో నీరు మురికిగా ఉన్నాయి. అయినా నిర్వాహకులు వాటిని మార్చలేదు. శుక్రవారం సందర్శనకు వచ్చిన చిన్నారులు ఆ నీటిలోనే ఆడుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal5.jpg)
17/21
![రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో 20 కిలోల భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది. ఇరవై కిలోల బరువున్న చేపలు ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal4.jpg)
18/21
![ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తెల్ల కాకి కనిపించింది. స్థానికులు ఆసక్తిగా, ఆశ్చర్యంగా తిలకించారు. తెల్లగా ఉండటానికి.. మెలనిన్ అనే వర్ణద్రవ్యం తగ్గుదల, జన్యులోపాలే కారణమని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని జంతుశాస్త్ర అధ్యాపకులు కె.బాబు తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal3.jpg)
19/21
![మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal2.jpg)
20/21
![పచ్చిరొట్ట విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలోని ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు ఎండను సైతం లెక్కచేయకుండా వరుసలో నిలబడ్డారు. కొందరు రైతులు మండే ఎండకు నిలబడలేక వరుసలో కాగితాలు, రాళ్లను ఉంచారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal1.jpg)
21/21
![హైదరాబాద్లోని ఎంజీబీఎస్ ఈమధ్య ప్రయాణికులకు కాకుండా సరకు రవాణా చేరవేతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్లాట్ఫాంలు అన్నీ ఇలా సామగ్రితో నిండిపోయి కనిపించాయి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/259052024chitralu--gal/25052024chitrlau--gal0.jpg)
Tags :
మరిన్ని
-
కార్గిల్ యుద్ధ దినోత్సవం.. రక్షణశాఖ ఆధ్వర్యంలో పరేడ్
-
అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
-
చిత్రం చెప్పేవిశేషాలు (26-07-2024)
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (25-07-2024)
-
చిత్రం చెప్పేవిశేషాలు (24-07-2024)
-
కుప్పంలో భువనేశ్వరికి ఘన స్వాగతం
-
చిత్రం చెప్పేవిశేషాలు (23-07-2024)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
ఉజ్జయిని మహాకాళి బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి
-
చిత్రం చెప్పేవిశేషాలు (22-07-2024)
-
రెండో రోజు ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు
-
చిత్రం చెప్పేవిశేషాలు (21-07-2024)
-
మాదాపూర్లో ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
ఘనంగా కళాశాల గ్రాడ్యుయేషన్ డే
-
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. ప్రయాణికుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (20-07-2024)
-
విశాఖలో భారీ వర్షం.. రహదారులు జలమయం
-
రైతుల రుణమాఫీ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
-
నెల్లూరులో రెండో రోజు రొట్టెల పండుగ..
-
చిత్రం చెప్పేవిశేషాలు (18-07-2024)
-
తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
-
నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (17-07-2024)
-
నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద భక్తుల సందడి
-
రహదారులపై వరద నీరు.. ప్రయాణికుల అవస్థలు
-
చిత్రం చెప్పేవిశేషాలు (16-07-2024)
-
విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన