News in pics: చిత్రం చెప్పే విశేషాలు (22-05-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 22 May 2024 11:00 IST
1/14
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
2/14
ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకున్న వేళ... చల్లటి గాలులు తనువును మీటుతున్న సమయాన... గోదావరి ఒడ్డు కనువిందు చేసింది. తూర్పుగోదావరి జిల్లా కుక్కునూరు మండలం వింజరం ఓడరేవు వద్ద కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
3/14
ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కరీంనగర్ మానేరు జలాశయం. సూర్యకిరణాలు జలాశయంపై పడినప్పుడు.. ఇలా వెండి పరిచినట్లు చూపరులకు కనువిందు చేసింది. వెండి వెలుగులో మత్స్యకారులు చేపలు పట్టడం.. మానేరంతా వెండి కప్పి వేసిందా? అనే దృశ్యాలు అందరిని కట్టిపడేశాయి.
4/14
వచ్చే జూన్ 2కు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి భేటీ అయ్యారు.
5/14
మత్తడివాగు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రధాన రహదారికి అనుకొని ఉండటంతో చూపరులను ఆకట్టుకుంటూ నిండుకుండను తలపిస్తుండేది. ప్రస్తుతం జలాశయంలో నీరు లేక అడుగంటిపోయింది. 2008లో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఎప్పుడూ ఇలా చూడలేదంటున్నారు రైతులు.
6/14
ట్రాక్టర్ ఇంజిన్పై ఎంచక్కా కూర్చొని ఓ కొండముచ్చు స్టీరింగ్ పట్టుకుందిలా.. మధిర మండలం చిలుకూరు గ్రామంలో కోతులను పారదోలేందుకు ఒకరు కొండముచ్చును కాపలాగా పెట్టారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద నిలిపిన ట్రాక్టర్కు దాన్ని కట్టేయగా సీట్లో కూర్చుని స్టీరింగ్ను పట్టుకుంది.
7/14
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట-బుట్టాయిగూడెం మండలాల సరిహద్దులోని గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలోని కొండపైన చక్కని జలపాతం ఉంది. ఇది నడివేసవిలో భక్తులకు ఎనలేని సాంత్వనను అందిస్తోంది.
8/14
వరంగల్ జిల్లా పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ దేశాల కరెన్సీ నోట్లతో మాలలు తయారు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
9/14
ఎండ తీవ్రతకు సతమతమవుతున్న మూగజీవులు నీడ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని చెట్ల మధ్య కొండముచ్చులు తిరుగుతూ భవన కిటికీల పక్కన ఇలా సేదతీరుతున్నాయి.
10/14
హైదరాబాద్లోని కూకట్పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్ మైదానంలో ఏర్పాటుచేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్లో జలకన్యల ప్రదర్శన ప్రారంభించారు. స్పెయిన్ నుంచి రప్పించిన జలకన్యలు వాటర్ టన్నెల్లో విన్యాసాల చేసి ఆకట్టుకున్నారు.
11/14
ఇటీవల వర్షాలకు హైదరాబాద్లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఉన్న ఉక్కు వంతెనపై పేరుకుపోయిన వ్యర్థాలను, మట్టిని తొలగిస్తున్నారు. మళ్లీ వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.
12/14
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ సీఎం బుధవారం ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లిస్తారు.
13/14
ఇటీవల మూడు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అడపాదడపా కాస్త విరామం ఇవ్వడంతో వానకు తడిచిన పాత పుస్తకాలను రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో ఓ చిరు వ్యాపారి ఇలా రహదారిపై ఆరబెట్టారు.
14/14
పచ్చదనంతో ఉట్టి పడుతూ కోనసీమ అందాలతో పోటీ పడుతున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోనిదే. ట్యాంక్బండ్ చుట్టూ ఏపుగా పెరిగిన వృక్షాలు నగరానికి సరికొత్త అందాలను తీసుకొస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మరింత ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్