News in images: చిత్రం చెప్పే విశేషాలు (24-05-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 24 May 2024 12:38 IST
1/22
![ఓ రైతు సూర్యుడి ఎండ నుంచి రక్షణగా శిరస్త్రాణాన్ని వినియోగించడం విశేషం. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతు శివాజి వడ్లు ఆరబెట్టే పనిలో ఎండ నుంచి రక్షణకు శిరస్త్రాణాన్ని పెట్టుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal5.jpg)
2/22
![గ్రామాలు, పట్టణాలు ఎక్కడ వడ్లు ఆరబెట్టినా కోతులు గుంపులుగా దాడిచేసి ఆరగిస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ రైసు మిల్లు ఆవరణలో ఆరబెట్టిన ధాన్యాన్ని మర్కటాలు ఆరగిస్తుండగా న్యూస్టుడే క్లిక్ మనిపించింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal4.jpg)
3/22
![ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కొండ కనకయ్య అనే వ్యాపారి తన ఇంటి ముందు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం విపరీతమైన ఎండతో విలవిలలాడిన ఓ శునకం తొట్టెలో నీటిని గమనించి ఇలా కూర్చొని ఉపశమనం పొందింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal3.jpg)
4/22
![వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మహ్మద్హుస్సేన్పల్లి ఊర చెరువులో గురువారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. మూడు అడుగుల పొడవు, 20 కిలోల బరువు ఉందని మత్స్యకారుడు శివ తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal2.jpg)
5/22
![హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మాదాపూర్ ఖానామెట్ వద్ద మిట్ట మధ్యాహ్నం గొడుగులు వేసుకుని మరీ సన్నటి ధారతో వస్తున్న మంచినీటిని మోటార్ల సాయంతో లాగుతూ పైపులు ద్వారా పట్టుకుంటున్న స్థానికులు ఇలా కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal1.jpg)
6/22
![నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణాతీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇలా అందంగా విరబూశాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరిగే ఈ ఔషధ మొక్క శాస్త్రీయ నామం ‘క్లియోమ్ చెల్లిడోని’ అని, తెలుగులో అడవి ఆవాల మొక్కగా పిలుస్తారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/24052024chitralu--gal0.jpg)
7/22
![విజయనగరం: కేరళలో ఇటీవల జరిగిన మిస్ఇండియా ప్రీ-టీన్ పోటీల్లో గజపతినగరానికి చెందిన గర్భాం ప్రీతి పట్నాయక్ విజేతగా నిలిచారు. టాలెంట్, డ్రెస్సింగ్, నృత్యం విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-16.jpg)
8/22
![తమిళనాడు: కొడైకెనాల్ బ్రయాంట్ పార్క్లో కొనసాగుతున్న పుష్ప ప్రదర్శన, వేసవి ఉత్సవంలో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకున్న పోటీలను ఆర్డీవో శివరామన్ ప్రారంభించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-15.jpg)
9/22
![కర్నూలు: సప్తనదీ సంగమ క్షేత్రంలో విదేశీ పక్షులైన ఫ్లెమింగోలు పది రోజులుగా తిరుగుతూ సందడి చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పక్షులతో పాటు కొంగలు, డక్బిల్ బాతులు, ఇతర పక్షులు కనువిందు చేస్తున్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-14.jpg)
10/22
![చిత్తూరు: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగియ నుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండానే సర్వదర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-13.jpg)
11/22
![విశాఖపట్నం: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జెర్బరా పూలు ఆకట్టుకుంటున్నాయి.శాస్త్రవేత్తలు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లుగా గ్లాడియోలస్, లిల్లియం, చైనాఆస్టర్, జెర్బరా, బంతి, తులిప్ వంటి వివిధ రకాల పూలు సాగు చేస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-12.jpg)
12/22
![పువ్వుల్లోని మకరందాన్ని జుర్రుకోవాల్సిన తేనెటీగలు మంచినీటి కోసం అల్లాడిపోయాయి. ఏలూరు శాంతినగర్ లోని నీటిశుద్ధికేంద్రం ఆవరణలోని కొళాయి చెంత ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రాలివి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-11.jpg)
13/22
![హైదరాబాద్: బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని గురువారం హుస్సేన్సాగర్లోని బుద్ధవిగ్రహం వద్ద బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పబ్లిక్గార్డెన్లో తథాగతుని పవిత్ర అవశేషాలతో(ధాతువులు) ఏర్పాటు చేసిన మందిరాన్ని పలువురు సందర్శించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-10.jpg)
14/22
![ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి.1974లో ఎనిమిది జింకలతో అభయారణ్యం ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు జింకల సంతతి 140కి చేరింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-09.jpg)
15/22
![నెల్లూరు: సీతారామపురం గ్రామ పంచాయతీ పండ్రంగి పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి.ఈ సందర్భంగా విఠలేశ్వరస్వామి పార్వేటోత్సవం కన్నులపండువగా సాగింది.ఆలయం వద్ద చిన్నారుల పండరిభజన ఆకట్టుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-08.jpg)
16/22
![చిత్తూరు: తిరపతి శ్రీ కపిలేశ్వరాలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా జరిగింది.ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం జరిగింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-07.jpg)
17/22
![చిత్తూరు: శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి వైశాఖ పౌర్ణమి గరుడ వాహనసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-06.jpg)
18/22
![శ్రీకాకుళం: మండలం అక్కుపల్లి శివసాగర తీరంలో గురువారం 100 మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లింది. స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పర్యాటకులు సముద్ర స్నానం చేయకుండా వెనుదిరిగారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-05.jpg)
19/22
![విశాఖపట్నం: వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గురువారం ఉదయం అనకాపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కమ్మేసింది. దీంతో రహదారులు, సమీప భవనాలు కూడా కనిపించలేదు. సూర్యుడు ఉన్నా మంచు ముసుగు తొలగలేదు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-04.jpg)
20/22
![వరంగల్: ములుగు జిల్లా కేంద్రం గొల్లవాడలోని ఆగయ్య అనే వ్యక్తి ఇంటి ముందు ఒక మొదలుతో రెండు చెట్లు ఉన్నాయి. ఒకటి రావి, మరొకటి సుబాబుల్ చెట్టు ఉండటంతో.. అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-03.jpg)
21/22
![మహబూబ్నగర్: రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో గంగ పూజలు నిర్వహిస్తున్న మహిళలను చిత్రంలో చూడొచ్చు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-02.jpg)
22/22
![హైదరాబాద్: మూసాపేట భరత్నగర్ పైవంతెన మధ్యలో ఓ వాటర్ ట్యాంకర్ టైరు పేలడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్ వరకు ట్రాఫిక్ భారీగా నిలిచింది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/23052024chitra-varthalu/23052024chitra-01.jpg)
Tags :
మరిన్ని
-
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ
-
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం
-
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష.. హాజరైన అభ్యర్థులు
-
చిత్రం చెప్పే విశేషాలు (16-06-2024)
-
అట్టహాసంగా ఎయిర్ ఫోర్స్ గ్రాడ్యుయేషన్ పరేడ్
-
‘ప్రజా దర్బార్’లో మంత్రి నారా లోకేశ్
-
ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ.. ఫొటోలు
-
చిత్రం చెప్పే విశేషాలు (15-06-2024)
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. సంబరాలు
-
చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)
-
షూటింగ్ శిక్షణా శిబిరంలో మెరిసిన నటి రెజీనా
-
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
-
చిత్రం చెప్పే విశేషాలు (13-06-2024)
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హైలైట్ పిక్స్ ఇవే!
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
-
ఏపీ నూతన మంత్రివర్గం.. సీఎంగా చంద్రబాబు
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పడవతో తెదేపా నేతల ర్యాలీ
-
ముగిసిన వేసవి సెలవులు.. పాఠశాలలు పునఃప్రారంభం
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రముఖులు
-
ముగిసిన వేసవి సెలవులు.. స్కూళ్లు పునఃప్రారంభం
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన వేదిక
-
చిత్రం చెప్పే విశేషాలు (12-06-2024)
-
కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఫొటోలు
-
చిత్రం చెప్పే విశేషాలు (11-06-2024)
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన సీఎం
-
సూగూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బాలయ్య
-
చిత్రం చెప్పే విశేషాలు (10-06-2024)
-
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
-
రామోజీరావుకు తుది వీడ్కోలు.. హాజరైన ప్రముఖులు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!