Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. ముగిసిన అంత్యక్రియలు

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె భౌతిక కాయానికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళి అర్పించారు. అనంతరం లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు పాడె మోశారు. లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Updated : 23 Feb 2024 17:54 IST
1/22
2/22
3/22
4/22

 

లాస్య నందిత భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
  లాస్య నందిత భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని