Fake Liquor Case: విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్‌ అనుచరుల హంగామా

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 03 Nov 2025 00:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేశ్‌ అనుచరులు, వైకాపా కార్యకర్తలు హంగామా సృష్టించారు. జోగిని అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. ఆసుపత్రి క్యాజువాల్టీ వార్డు అద్దాలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో పోలీసులకు, జోగి రమేశ్‌ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. వైద్య పరీక్షల అనంతరం  ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

ఇవాళ ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. ఆయనతోపాటు సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు రూ.3 కోట్ల సాయం చేస్తానని రమేశ్‌ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు