రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Nov 2025 04:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖలోని రుషికొండ బీచ్‌ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. వీటిని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. సముద్రం లోపల రాళ్లు, ఇసుకలో మనుగడ సాగించే ఈ జీవులు ఆహార అన్వేషణలో భాగంగా పైకి వచ్చే సందర్భాల్లో వలలకు చిక్కుతాయని జాలర్లు చెబుతున్నారు. తమకు ఉపయోగం లేని పాములు, కప్పలను మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.

న్యూస్‌టుడే, విశాఖపట్నం (సాగర్‌నగర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు