భావితరాలకు ఉపయోగపడే పుస్తకం.. ‘ఏ టేల్‌ ఆఫ్‌ టూ స్టేట్స్‌’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 15 Dec 2025 04:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

‘ఏ టేల్‌ ఆఫ్‌ టూ స్టేట్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో రచయితలు ఐ.వెంకటరావు, అనురాధ, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌  అధికారి కె.చంద్రహాస్, ప్రచురణకర్తలు ఐ.వేణు, ఐ.రఘు

ఈనాడు, అమరావతి: ప్రముఖ పాత్రికేయుడు ఐ.వెంకటరావు రాసిన ‘విలీనం-విభజన’ పుస్తకం ఆంగ్ల అనువాదం ‘ఏ టేల్‌ ఆఫ్‌ టూ స్టేట్స్‌’ను సీఎం చంద్రబాబు ఆదివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరిశోధకులు, భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్‌.అనురాధను ఆయన అభినందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్ని పరిపాలించిన సీఎంల గురించి రచయిత ఇందులో వివరించారు. రచయిత ఐ.వెంకటరావు, రచయిత, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కె.చంద్రహాస్, పుస్తక ప్రచురణకర్తలు ఐ.వేణు, ఐ.రఘు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు