బస్సులో 100 మంది ప్రయాణికులు.. సీజ్‌ చేసిన అల్లూరి జిల్లా పోలీసులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 15 Dec 2025 07:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సీజ్‌ చేసిన బస్సు

చింతూరు, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణికులు పరిమితికి మించి ఉండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు సీజ్‌ చేశారు. చింతూరు - మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఇటీవల ఒక ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై 9 మంది మృతి చెందడంతో పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో ఓ బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించి, బస్సు సీజ్‌ చేశామని చింతూరు ఎస్సై రమేశ్‌ తెలిపారు.

బస్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు

Tags :
Published : 15 Dec 2025 07:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని