Nara Lokesh: ‘నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం’ అంశం.. తెదేపా అధిష్ఠానం కీలక ఆదేశాలు

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో తెదేపా అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది.
ఇటీవల సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనికుల సేవలు ఎనలేనివి: జిల్లా కలెక్టర్
[ 08-12-2025]
దేశం రక్షణ కోసం సైనికులు అందిస్తున్న సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
రాజధాని ప్రాంతంలో గ్రామ కంఠాలను పరిశీలించిన సీఆర్డీఏ అధికారులు
[ 08-12-2025]
రాజధాని అమరావతిలోని నేలపాడులో సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ.భార్గవ తేజ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్.భాగ్యరేఖతో కలిసి స్థానికంగా గ్రామ కంఠం భూములను పరిశీలించారు. -
హస్తకళలను ప్రోత్సహించేందుకే వారోత్సవాలు: పసుపులేటి హరిప్రసాద్
[ 08-12-2025]
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న హస్తకళకారులను ప్రోత్సహించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. -
కొండపల్లి కోన.. జలపాతాల వీణ
[ 08-12-2025]
విజయవాడకు పది కి.మీ దూరంలో ఉండే దట్టమైన కొండపల్లి అటవీ ప్రాంతంలో మనసు దోచే జలపాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్లు.. కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. సీతాకోక చిలుకల వయ్యారాల నడుమ ఇవి చూడముచ్చటగా ఉంటాయి. -
కాలువ కట్టు.. కన్నీరు తుడిచేట్టు
[ 08-12-2025]
నగరంలో వర్షపు నీటి పారుదల వ్యవస్థ(ఎస్డబ్ల్యూడీ)ను అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఆయా డ్రెయిన్ల నిర్మాణ పనులను పట్టాలెక్కించనున్నారు. -
సౌకర్యాలు సరే.. సంతృప్తి చూడరే!
[ 08-12-2025]
విజయవాడ దుర్గగుడిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేపట్టారు. అయితే భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కొన్ని సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. -
భాషపై మమకారం.. సాహిత్య సహకారం
[ 08-12-2025]
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఎందరో కృషి చేస్తుంటారు. కానీ మచిలీపట్నానికి చెందిన డా.చింతలపాటి మోహన మురళీకృష్ణ ఉద్యోగాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తెలుగులో ఎంఏ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.5 -
సాంకేతిక ఆధారాలతో చిక్కారు
[ 08-12-2025]
నకిలీ మద్యం కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. నిందితుల పాత్రను నిరూపించే పలు ఆధారాలు వారి ఫోన్లలోనే లభించాయి. వారి మధ్య సాగిన చెల్లింపులు, వాటి తాలూకూ స్క్రీన్షాట్లు, లేబుళ్ల డిజైన్లు, సంభాషణలు పక్కాగా దొరికాయి. -
పండగ పూట.. పప్పన్నం లేదా?
[ 08-12-2025]
కూటమి సర్కారు అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటినా కందిపప్పు ఊసే లేకపోవడంపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. -
టకటకా కొనుగోళ్లు.. చకచకా చెల్లింపులు
[ 08-12-2025]
వైకాపా హయాంలో ధాన్యం విక్రయాల్లో విధించిన నిబంధనలతో రైతులు అనేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని సడలించడంతో పాటు మద్దతు ధర అందిస్తోంది. -
దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా విజయవాడ
[ 08-12-2025]
దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా విజయవాడ ఎదుగుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతికంగా ఇది సుసంపన్నమైన నగరమన్నారు. -
స్వర్ణోత్సవ కలయిక.. మధురమైన జ్ఞాపిక
[ 08-12-2025]
గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలోని శ్రీఅట్లూరి వెంకట్రామయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975లో పదో తరగతి చదివిన విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో ఆదివారం సందడి చేశారు. -
అనుభవాల్లోంచే.. కథలు పుట్టుకొస్తాయ్
[ 08-12-2025]
‘జీవిత అనుభవాలు, ఆలోచనల్లో నుంచే కథలు పుట్టుకొస్తాయి. కాలంతో పాటే కొత్త కథలు జాలువారుతున్నాయి. సామాజిక రీతులను ప్రతిబింబిస్తూ విభిన్న కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. -
పోలీసుల అదుపులో రౌడీషీటర్ సాయి
[ 08-12-2025]
జగ్గయ్యపేటలో సంచలనం సృష్టించిన సస్పెక్ట్షీటర్ నవీన్రెడ్డి హత్య కేసులో నిందితుడైన రౌడీషీటర్ పిల్ల సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
జాప్యం వద్దు.. జాగ్రత్త పడదాం
[ 08-12-2025]
గుంటూరు శివారు గ్రామాన్ని పట్టిపీడించిన మెలియాయిడోసిస్ వేదన మరువక ముందే రాష్ట్రవ్యాప్తంగా మరో వ్యాధి తెరపైకి వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో ఇక్కడా ఉలికిపాటు మొదలైంది. -
లక్ష్యం ఘనం.. ఆచరణలో కనం..!
[ 08-12-2025]
లక్ష్యాలు ఘనంగానే ఉన్నాయి.. ఆచరణలో మాత్రం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వ అనుమతులు రాక ప్రతిబంధకంగా మారడం, అవసరమైన సిబ్బందిని సమకూర్చడంలో సమస్యలు నెలకొనడం.. వె -
లంచాల షాక్
[ 08-12-2025]
సీఆర్డీఏ పరిధి విద్యుత్తుశాఖలో పనిచేసే ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పని ఏదైనా తనకు రావాల్సినవి ఇవ్వకపోతే నిలిపేస్తున్నారు. -
దారి మళ్లిస్తే.. పట్టించే యాప్‘రేషన్’
[ 08-12-2025]
పౌరసరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులతో క్యూఆర్ కోడ్, ప్రభుత్వ రాజముద్రతో ఉండేలా ముద్రించి కార్డుదారులకు అందించింది. -
లొట్టలేసే రుచి.. లాగించెయ్యరా మరి..!
[ 08-12-2025]
తెలుగింటి పిండి వంటల్లో అరిసెలది ప్రత్యేక స్థానం. సంక్రాంతి వచ్చిందంటే తెలుగింటి లోగిళ్లన్నీ అరిసెల ఘుమఘుమలతో నిండిపోతాయి. -
200 ఏళ్ల నాటి దక్షిణావృత శంఖం
[ 08-12-2025]
ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోన్న మంగళగిరిని ఒకప్పుడు మంగళాద్రిగా పిలిచేవారు. పడుకున్న ఏనుగు ఆకారంలో ఈ కొండ ఉండడం దీని ప్రత్యేకత. -
కార్పొరేషన్లో ఎలుకలు పడ్డాయి..!
[ 08-12-2025]
గుంటూరు నగరపాలకసంస్థ (జీఎంసీ) కార్యాలయంలో మూషికాలు ప్రధాన ఇబ్బందిగా మారాయి. అక్కడా ఇక్కడా అని కాదు.. కమిషనర్ ఛాంబర్ నుంచి అనేక విభాగాల వరకు ఇదే పరిస్థితి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


