TDP: రెండు మూడు రోజుల్లో తెదేపా లోక్సభ అభ్యర్థుల జాబితా
తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నారు. కింజరాపు రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం), ఎం. శ్రీభరత్ (విశాఖ), కేశినేని శివనాథ్ - చిన్ని (విజయవాడ), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), మాగుంట రాఘవరెడ్డి (ఒంగోలు), వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (నెల్లూరు) తెదేపా అభ్యర్థులుగా బరిలో నిలవడం ఖాయమైనట్లే.