Google: గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ: గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 14 Oct 2025 12:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ మారనుందని గూగుల్‌ (Google) క్లౌడ్‌ గ్లోబల్‌ సీఈవో థామస్‌ కురియన్‌ అన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్‌సీ-కేబుల్‌ విధానం అనుసంధానం చేస్తామని చెప్పారు. అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారన్నారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో థామస్‌ కురియన్‌ మాట్లాడారు. 

‘‘జెమీనీ-ఏఐ, గూగుల్‌ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్‌ ద్వారా అందుతాయి. దీని ద్వారా ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం కలుగుతుంది. రానున్న ఐదేళ్లలో 15 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశముంది. భారత్‌కే కాకుండా విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి ఇది దోహదపడుతుంది’’ అని థామస్‌ కురియన్‌ అన్నారు.

Tags :
Published : 14 Oct 2025 12:17 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు