మీలోనూ ఓ హనుమంతుడు!

జీవితంలో ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉండాలి. అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కుతెలియని పడవలా అయిపోతుంది. లక్ష్యసాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం, పడే శ్రమ. లక్ష్యం స్థిరంగా ఉండాలి. సాధన దృఢంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం.
ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు. ఒక పెద్ద చెట్టుపైన చిట్టచివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చుని ఉంది. దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష. ముందుగా ధర్మరాజు వచ్చాడు. చెట్టుమీద ఏం కనిపిస్తోందని అడిగాడు ద్రోణుడు. ‘చెట్టు, చెట్టుమీద పక్షి, ఆకాశం, పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి’ అన్నాడు యుదిష్ఠిరుడు. సరే... నువ్వు వెనక్కి వెళ్లు అని చెప్పి భీముణ్ని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. చెట్టు, కొమ్మలు, పక్షి, ఆకాశం... చెప్పాడు భీముడు. ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం, గురువు వాళ్లను తిప్పి పంపడం జరిగింది. చివరికి అర్జునుణ్ని పిలిచి అందర్నీ అడిగిన ప్రశ్నే అతణ్నీ అడిగాడు. అర్జునుడు నిశ్చలంగా ‘నాకు కేవలం పక్షి కన్నే కనబడుతోంది. ఇంకేం కనబడటంలేదు’ అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో ‘బాణం వెయ్యి అర్జునా’ అన్నాడు. మరుక్షణం అర్జునుడి ధనుస్సులోంచి బాణం దూసుకుపోయింది. పక్షి నేలకూలింది.
అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం. అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేవీ కనిపించకూడదు. అంత స్థిరమైన దృష్టి కోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరమైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అర్జునుడి లక్ష్యం పక్షి కన్ను లాగా మనకీ మన లక్ష్యం ఏంటో కచ్చితంగా తెలియాలి. దానిపైనే దృష్టి నిలపాలి. లక్ష్యసాధనకు కావాల్సింది స్పష్టమైన దృష్టి, ఏకాగ్రత. లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా... దాన్ని చేరాలంటే మనసు, శక్తి, శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి. అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి వెనక్కి మళ్లకూడదు.
రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. వైద్యుడు సుషేణుడు వచ్చి చూసి హిమాలయాల్లో ఉన్న సంజీవనిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకు దూసుకెళ్లాడు. అక్కడ సంజీవని ఏదో తెలియలేదు. అందుకని ఆయన తల పట్టుకుని కూర్చోలేదు. ఏ చెట్టో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పెకిలించుకు తీసుకెళ్లాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. నిత్యజీవితంలో మనకూ ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటికి వెరచి వెనక్కి తగ్గవద్దని చెబుతుంది హనుమంతుడి దివ్యగాథ. ఆనాడే కాదు, ఈనాడైనా లక్ష్యసాధనకు పట్టుదలే ప్రధానం.
అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది! హనుమంతుడు మనలోనూ ఉన్నాడు. ఆ సత్యం తెలుసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానివైపు బలంగా అడుగేసినప్పుడు ఆయన బయటపడతాడు.
మావూరు విజయలక్ష్మి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

హృదయ వికాసం
ఒక కమ్మటి పాట వింటే అది వీనుల విందవుతుంది. సానుకూలమైన బాహ్యప్రేరణతో మనసు హాయిని అనుభవిస్తుంది. ఆ హాయి శరీరాన్నీ తాకుతుంది. అంటే ఓ మధురమైన పాట మనసుతో పాటు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. -

సంస్కారం
సంస్కారం అంటే మానసిక భావన. అంతర్గత లక్షణాలను బయటపెట్టే ప్రవర్తన. ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే జీవిత సంఘటనలు; వివిధ వయసులలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అంతరంగిక అనుభవాలు అతణ్ని ఏ విధంగా ప్రేరేపించి వ్యవహరింపచేస్తాయో అదే సంస్కారం. -

భక్తి చైతన్యం
భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది. -

తన కోపం తనకే కాదు.. తరతరాలకూ శత్రువు!
కోపం రెండక్షరాల చిన్నమాటే కానీ జీవితాలను సర్వనాశనం చేయగల శక్తి దానికుంది. ముక్కుమీద కోపం ఉంచుకుని తిరిగేవారు మనకు తరచూ కనపడుతూనే ఉంటారు. కానీ ఆ కోపం వల్ల వాళ్లేం కోల్పోతున్నారన్నది మాత్రం బయటికి కనపడదు. -

క్షణమొక వరం
‘నా పుట్టుకకు పరమార్థం నిను ప్రార్థించడమూ ఆరాధించడమే. యా అల్లాహ్.. నా ఇహపరలోకాల భాగ్యరేఖల్ని నేనే తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించావు. నా కోసమే నేను కాదంటూ నా పట్ల ఇతరులకు హక్కులు ఉండేటట్లు నాపైన ఇతరుల బాధ్యతలు ఉండేటట్లు సృష్టించావు. -

జ్ఞాపకాల పందిరి
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకాల పందిరి కింద సేదతీరే సందర్భాలూ ఎక్కువవుతాయి. సంఘంలో తలెత్తుకు తిరిగేలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మనసు వినమ్రతతో నిండుతుంది. -

పుష్పార్చన
పూజ అంటే కేవలం చేతులు జోడించడం కాదు. ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇందులో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి పువ్వులు. వాటి రంగు, పరిమళం, సున్నితత్వం, శోభ వంటి నాలుగు ముఖ్యమైన లక్షణాలూ అద్భుతంగా కలిసిపోయి దేవుడి పూజలో విశిష్టస్థానం పొందాయి. -

హోళీ... వన్నెచిన్నెలు
ఫాల్గుణ పూర్ణిమ ఎన్నో ప్రత్యేకతలతో కూడిన పర్వం. ఆధ్యాత్మిక - సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన పండుగ ఇది. హోళీ పూర్ణిమ, కాముని పున్నమి, వసంత పూర్ణిమ మొదలైన పేర్లతో ఈ రోజును వ్యవహరిస్తారు. ముఖ్యంగా ‘వసంతాల పండుగ’గా దీన్ని వర్ణించవచ్చు. -

ప్రసాదం
అన్నానికి మరో పేరు ‘సాదం’. దైవనివేదనకు యోగ్యమైన సాదం- ప్రసాదం! ప్రసాదమనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన, అనుగ్రహ రూపమైనదని అర్థం. -

కాలజ్ఞానం
కాలప్రవాహంలో క్షణాలు, గంటలు, దినాలు, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ అనంత కాలవాహినిలో బుద్భుదప్రాయమైన జీవితపు ఆవలితీరం చేరుకోవడానికి మనిషి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ఎరుక లేకుండా ఎదురీదితే చివరికి మిగిలేవి ప్రయాస, నిరాశలే. -

తప్పెవరిది?
సమాజంలో విలువలు పడిపోతున్నాయని తెగ బాధ పడిపోతాం. ఎదుటివాడు చేసే తప్పులను ఎత్తి చూపేటప్పుడు వచ్చే ఉద్రేకం, ఆవేశం మనం కానీ, మనవాళ్లు కానీ తప్పుచేసినప్పుడు రావు. -

సాక్షులున్నారు!
కళ్లు మూసుకుని పాలు తాగుతూ పిల్లి తననెవ్వరూ గమనించడం లేదనుకుంటుందట! అదేవిధంగా మోహంతోనో, ఆవేశంతోనో, అహంకారంతోనో, అధికారంతోనో కళ్లు మూసుకుపోయి ఎవరు చూడొచ్చారులే అనుకుంటూ అధర్మపు పనులు చేయవచ్చు. -

అసలైన పూజ ఏది?
మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది. -

మహా వాక్యాలు
మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా? -

వీరమాతలు
చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు. -

మానస సరోవరం
మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం. -

ఆధ్యాత్మిక అద్భుతాలు
ఈ లోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది. -

ఆలయం
‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది. -

పరమాత్మను మెప్పించాలి
భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో... ఎలా పిలిచినా పలుకుతాడు. కరుణిస్తాడు. రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మద్ది వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారులు నలకూబరుడు, మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాపవిముక్తుల్ని చేశాడు. -

అదే అత్యుత్తమ సేవ...
రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.








