క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ పేరిట రూ.1.68 కోట్లకు టోకరా

Eenadu icon
By Crime News Desk Published : 02 Nov 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నారాయణగూడ, న్యూస్‌టుడే: క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట 75 ఏళ్ల వయోధికుడు రూ.1.68 కోట్లు నష్టపోయారు. నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వయోధికుడిని సామాజిక మాధ్యమ వేదిక ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు ఫైనాన్షియల్‌ ఎనలిస్టులుగా చెప్పుకొంటూ సంప్రదించారు. మార్కెట్‌లో గతంలో నష్టపోయిన సొమ్ము తిరిగి పొందడానికి సాయం చేస్తామని నమ్మించారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ ‘పీసీ.మార్కెటాక్సెస్‌.వీఐపీ’లో ఖాతా తెరిపించారు. బాధితుడితో మార్చి 6 నుంచి జూన్‌ 6 మధ్య కాలంలో రూ.54.80 లక్షలు పెట్టుబడి పెట్టించారు. రూ.1.38 కోట్ల లాభం వచ్చిందని చూపించారు. దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించగా... అందుకు పన్నులు, రకరకాల రుసుముల పేరుతో దాదాపు రూ.1.14 కోట్లు కట్టించుకున్నారు. అనంతరం స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు... రూ.1.68 కోట్లు నష్టపోయినట్లు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు