వర్షాలకు పంట దెబ్బతిందని మనస్తాపంతో రైతు ఆత్మహత్య

Eenadu icon
By Crime News Desk Published : 02 Nov 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిర్పూర్‌(టి), న్యూస్‌టుడే: వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి సరిగా రాదనే మనస్తాపంతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన పిట్టల కృష్ణయ్య(64) శుక్రవారం సాయంత్రం చేనులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. కృష్ణయ్య తన 4 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవలి వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడికి రూ.లక్ష వరకు అప్పు చేశారని, ఆశించిన దిగుబడి రాదని తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య దుర్గమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు