ఆర్థిక ఇబ్బందులతో ఎస్సై బలవన్మరణం

Eenadu icon
By Crime News Desk Published : 02 Nov 2025 05:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నర్సంపేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో నివాసముంటున్న ఎండీ హఫీజుద్దీన్‌(59) ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో పోలీస్‌శాఖ స్పెషల్‌ బ్రాంచి ఎస్సైగా పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ఇంట్లో పురుగుమందు తాగగా.. కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మృతుడికి భార్య నూర్జాహాన్, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగ్గా.. ఒక కుమార్తె, కుమారుడికి పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. హఫీజజుద్దీన్‌ మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు