గుంటూరులో బయటపడ్డ కుళ్లిన మాంసం
తనిఖీల్లో 40 కేజీల పట్టివేత

నాణ్యత లేని మాంసాన్ని బయటకు తీయిస్తున్న ప్రకాష్నాయుడు తదితరులు
గుంటూరు (నగరపాలకసంస్థ), న్యూస్టుడే: గుంటూరులో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం భారీగా బయటపడింది. నగరంలోని పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, డొంక రోడ్డు, అమరావతి రోడ్డు, పాతమటన్ మార్కెట్ తదితర ప్రాంతాల్లోని మాంసం విక్రయ దుకాణాల్లో మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాశ్నాయుడు, జీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 6 దుకాణాల్లో ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన, కుళ్లిన 40 కేజీల మాంసం పట్టుబడింది. ఈ సందర్భంగా విక్రయదారులపై ప్రకాశ్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్య విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు చేసి, మాంసం నాణ్యతపై రాజీలేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాంసం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రవీణ, మీట్ కార్పొరేషన్ ఎండీ సుబ్బరత్నమ్మ, అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


