గుంటూరులో బయటపడ్డ కుళ్లిన మాంసం

Eenadu icon
By Crime News Desk Updated : 03 Nov 2025 05:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తనిఖీల్లో 40 కేజీల పట్టివేత

నాణ్యత లేని మాంసాన్ని బయటకు తీయిస్తున్న ప్రకాష్‌నాయుడు తదితరులు

గుంటూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: గుంటూరులో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం భారీగా బయటపడింది. నగరంలోని పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, డొంక రోడ్డు, అమరావతి రోడ్డు, పాతమటన్‌ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లోని మాంసం విక్రయ దుకాణాల్లో మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రకాశ్‌నాయుడు, జీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 6 దుకాణాల్లో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన, కుళ్లిన 40 కేజీల మాంసం పట్టుబడింది. ఈ సందర్భంగా విక్రయదారులపై ప్రకాశ్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్య విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు చేసి, మాంసం నాణ్యతపై రాజీలేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ, మీట్‌ కార్పొరేషన్‌ ఎండీ సుబ్బరత్నమ్మ, అధికారులు పాల్గొన్నారు.

Tags :
Published : 03 Nov 2025 04:53 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు