విద్యుదాఘాతంతో రైతు మృతి

Eenadu icon
By Crime News Desk Published : 03 Nov 2025 04:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చేవెళ్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు.. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తగిలి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సంతోష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడ గ్రామానికి చెందిన పడమటి భూపాల్‌రెడ్డి(55) రెండెకరాల్లో వరి పంట సాగు చేశారు. పక్కనే ఉన్న సోదరుడి వరి పంట చుట్టూ అడవి పందుల కోసం విద్యుత్తు తీగ ఏర్పాటు చేశారు. ఆదివారం భూపాల్‌రెడ్డి పొలానికి వెళ్తుండగా కాలు జారి విద్యుత్తు తీగను తాకి పడిపోయారు. తండ్రి రాలేదని కుమారుడు నరేందర్‌రెడ్డి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. అనుమానంతో వెళ్లి చూడగా పొలం గట్టుపై పడి ఉన్నారు. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు