Murder: తల నరికి.. చేతుల వేళ్లు తొలగించి..
మహిళ దారుణ హత్య!
నవీపేట, న్యూస్టుడే: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో దారుణం వెలుగు చూసింది. కిరాతకంగా హత్యకు గురైన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి తల లేదు.. కుడి చేతిని మణికట్టు వరకు, ఎడమ చేతి వేళ్లను సగం వరకు నరికి వేశారు. దీనికి సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివీ... మిట్టాపూర్కు చెందిన రైతు సతీష్ శనివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లారు. పొలం సమీపంలో శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, ఏసీపీ రాజావెంకట్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని.. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై తిరుపతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అత్యాచారానికి గురైన ఆమెను దారుణంగా హత్య చేసి, శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనంలో ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. నరికిన అవయవాల జాడ కోసం మృతదేహం కనిపించిన ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాతో జల్లెడ పట్టారు. పోలీసు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. పోలీసులు పది బృందాలతో గాలింపు చేపట్టారు.
డీఎన్ఏ పరీక్షలకు చిక్కకుండా..!
నేరస్థులు తమ ఆచూకీ లభ్యం కాకుండా ఉండేందుకే ఆమె చేతి వేళ్లు నరికేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాడినప్పుడు ఆమె చేతి వేళ్ల గోళ్లలో వారికి సంబంధించిన ఆధారాలు చిక్కే అవకాశం ఉంటుందని.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే బండారం బయటపడుతుందని అనుమానించి దుండగులు నరికేసి ఉంటారని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

గుంతలో పడి చిన్నారి మృతి
అభం... శుభం... తెలియని ఓ చిన్నారి అనుకోని పరిస్థితిలో అసువులు బాశాడు. విద్యాబుద్ధులు నేర్చుకుందామని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని ప్రమాదకర నీటిగుంత పొట్టన పెట్టుకుంది. - 
                                    
                                        

నాడు పెనుకొండలోనూ ఇదే తరహా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ప్రమాదం... పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ స్టేషన్ సమీపంలో జరిగిన దుర్ఘటన ఒకే తరహాలో ఉన్నాయి. - 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


