ఒక్కో సీటుకు రూ. లక్షపైనే వసూలు!
అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి.
బీఎడ్ కళాశాల యాజమాన్యాల తీరిది
న్యూస్టుడే, పాలనాప్రాంగణం
అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి. పొరుగు జిల్లాల్లో రూ.వేలు వెచ్చిస్తేనే సీటు లభిస్తుంటే ఇక్కడ మాత్రం అభ్యర్థుల జేబులను గుల్లచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు చెల్లించి ప్రవేశం పొందాక అసలు విషయం తెలిసి అవాక్కవడం అభ్యర్థుల వంతవుతోంది.
మంచిర్యాల జిల్లాలో బీఎడ్ కళాశాలలు లేవు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఉండగా ఇందులో ఒకటి ఉట్నూరులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ గిరిజన బీఎడ్ కళాశాల.. నిర్మల్ జిల్లాలో ఒకటి, కుమురం భీం జిల్లాలో రెండు కలుపుకొని మొత్తం ఆరు బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఉట్నూరులోని గిరిజన బీఎడ్ కళాశాల మినహాయిస్తే మిగిలిన అయిదు కళాశాలలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఇందులో 75 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా.. మిగిలిన 25 శాతం మేర సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ విషయంలో అంతగా ఇబ్బందులు లేకపోయినా యాజమాన్య కోటా సీట్ల విషయంలోనే అసలైన చిక్కు నెలకొంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లువలా వెలువడటం.. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేయాలన్నా.. బీఎడ్ అర్హత తప్పనిసరి. దీనికితోడు బీఎడ్ అర్హత కలిగి ఉంటే సెకండరీ స్కూల్ టీచరు(ఎస్జీటీ)తో పాటు స్కూల్ అసిస్టెంటు(ఎస్ఏ) పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉండటంతో అంతా డీఎడ్కి బదులు బీఎడ్ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, సీట్లు పరిమితంగా ఉండటంతో యాజమాన్యాలు తమను సంప్రదిస్తున్న వారికి ఒక్కో సీటుకు రూ.లక్షపైనే చెబుతూ సీట్లు లేవని, మీరు కాదంటే మరొకరు సిద్ధంగా ఉన్నారంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తరగతులకు హాజరుకావద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్తే సెమిస్టర్ లెక్కన అధిక డబ్బులు వసూలు చేస్తారని, తమ కళాశాలలో చేరాలంటూ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. మెరుగైన బోధనలో పోటీపడాల్సిన యాజమాన్యాలు జట్టు కట్టి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా విద్యావ్యాపారం కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సీటు ఉంది మరి!
జిల్లాలో ఏ బీఎడ్ కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించినా వారి నోట ఒకే సీటు ఉందనే మాట వినిపిస్తోంది. ఆలస్యం చేస్తే అదికూడా పోతుందని నమ్మబలుకుతున్నారు. చేసేదేమి లేక వారడిగినట్లు సబ్జెక్టు ఏదైనా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు ఇచ్చుకుంటున్నారు. మరీ బతిమాలితే నాలుగైదు విడతల్లో డబ్బులు కట్టొచ్చని ఒప్పుకొంటున్నారు.
అక్కడ రూ.25 వేలే..!
నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో యాజమాన్య సీటును కేవలం రూ.25 వేలకే ఇస్తున్నారు. తరగతులకు హాజరుకాకున్నా ఫర్వాలేదని, అంతా తామే చూసుకుంటామని చెబుతుండటం విశేషం. అక్కడి యాజమాన్యాల ప్రతిపాదన తమకు అనుకూలంగా ఉండటంతో పొరుగు జిల్లాలకు వెళ్లి అక్కడి కళాశాలల్లో చేరుతున్నారు. ఆ నోట.. ఈ నోట విషయం జిల్లాలో ఆయా కళాశాలల్లో చేరిన అభ్యర్థుల చెవిన పడటంతో ఇక్కడి యాజమాన్యాల తీరుతో మోసపోయామని లబోదిబోమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు