ఇంతింతై.. ప్రపంచమంతై!
సాఫ్ట్వేర్ రంగంలో జిల్లాకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం సంపాదిస్తున్నారు. వీరు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పైకి ఎదుగుతూనే గుర్తింపు వస్తుందని భావించి కష్టపడ్డారు.
ఆదిలాబాద్ బిడ్డల సాఫ్ట్వేర్ రంగ ప్రస్థానం
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
సాఫ్ట్వేర్ రంగంలో జిల్లాకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం సంపాదిస్తున్నారు. వీరు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పైకి ఎదుగుతూనే గుర్తింపు వస్తుందని భావించి కష్టపడ్డారు. ఒకరైతే కంపెనీ తరఫున ఏడు దేశాల్లోని ఉద్యోగులకు హెడ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొందరు స్వతహాగా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే తాము పుట్టి పెరిగిన ఆదిలాబాద్ గడ్డను మరవకుండా ఇక్కడ వారికి సైతం ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొస్తున్నారు. ఇదే విషయమై ఆదిలాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన వారిని ‘న్యూస్టుడే’ పలకరించింది. వారి విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం..
ఏడు దేశాల ఉద్యోగులకు బాస్గా ఎదిగి
చదివింది తెలుగు మాధ్యమంలోనైనా ఆంగ్ల అవసరాన్ని గుర్తించి అందులో ప్రావీణ్యం సంపాదించారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏడు దేశాల్లోని కంపెనీ సీఈఓలకు బాస్గా వ్యవహరిస్తూ ఏకంగా 4,800 ఉద్యోగుల పని తీరును పర్యవేక్షిస్తున్నారు. ఆయనే ఆదిలాబాద్ పట్టణం బ్రాహ్మణవాడ కాలనీకి చెందిన సంజీవ్దేశ్పాండే. స్థానికంగా పదో తరగతి వరకు విద్యనభ్యసించిన ఆయన ఇంటర్ ఆదిలాబాద్ ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ తరువాత జైపూర్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేసిన ఆయన 1999లో యూఎస్ఏ వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఎంబీఏ పూర్తిచేశారు. 2002లో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ‘ఎన్టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్’ కంపెనీలో చేరి అందులో అనతికాలంలోనే ఉన్నతస్థానానికి చేరుకున్నారు. తొలుత ఆ సంస్థకు సంబంధించి భారత దేశ సీఈఓగా వ్యవహరించిన ఆయనకు పనితీరుగా ఆధారంగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం భారత్తో పాటు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఖతర్, ఆస్ట్రేలియా దేశాల్లో సంస్థ తరఫున పని చేస్తున్న సీఈఓలకు హెడ్గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్లో ఐటీహబ్ను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఒక ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేయించేలా వారికి తమ సంస్థ తరఫున 100 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్ ఇప్పించి తొలి అడుగు వేయించారు. ఆదిలాబాద్ వాసులకు ఏదో చేయాలనే తపనతోనే సాఫ్ట్వేర్ కంపెనీలను ఇక్కడికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
విదేశాలల్లోనూ కార్యకలాపాలు
జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన జలగం రవీందర్రావు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో పదో తరగతి వరకు చదివారు. అమరావతి విశ్వవిద్యాలయంలో 1994లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన తొలుత వివిధ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. దాంతో సంతృప్తి చెందని ఆయన సొంతంగా కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మిత్రులతో కలిసి ‘ఏఈఎస్’ సర్వీసెస్ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనే కాకుండా కెనడా, యూఎస్ఏలకు కంపెనీని విస్తరించారు. దాదాపు 152 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రులే కాకుండా సాధారణ డిగ్రీ చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు ఆయన ఆదిలాబాద్ వాసులకోసం స్థానికంగా ‘ఫినిషింగ్ స్కూల్’ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
పిన్న వయసులోనే....
తాంసికి చెందిన వేదాంత్ పడిగెల్వార్ చిన్నప్పటి నుంచే భిన్నంగా ఆలోచన చేయడం ఆయన ఎదిగేందుకు తోడ్పడింది. కేవలం 24 ఏళ్ల ప్రాయంలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్తోనూ అభినందనలు అందుకున్నారు. హైదరాబాద్లోని ఐటీ హబ్లోనూ ఆయన కంపెనీ ఉద్యోగులు పని చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆదిలాబాద్లో 5వ తరగతి వరకు చదివి మిగతా విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వెళ్లారు. కోయంబత్తూర్లోని అమృత విశ్వవిద్యాలయంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి ఇంగ్లాండ్లో 6 నెలల పాటు పనిచేశారు. ఉద్యోగ సమయంలోనే క్రికెట్ పోటీలు తిలకించే సమయంలో క్రీడాకారులు ఫీల్డింగ్లో ఎక్కడెక్కడ ఉన్నారని టీవీల్లో తిలకించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్లో భాగస్వామ్యం పంచుకున్నారు. సొంతంగా ‘ఁ-్న‘్మ’ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది తన ఉద్దేశమని వివరించారు.
సివిల్స్కు సన్నద్ధమై.. సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి
జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన మామిడిపల్లి రాఘవేందర్ సివిల్స్ సర్వీసెస్ కోసం డిగ్రీ చదువును ఎంచుకొని పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగి వచ్చేయడంతో ఆయనలో కొత్త ఆలోచన మొదలైంది. ఎంఏ వరకు చదివిన ఆయన ఆ తరువాత ఐటీ రంగంవైపు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందారు. 1999లో యూఎస్ఏ వెళ్లి అక్కడే వివిధ ఐటీ కంపెనీల్లో ప్రోగ్రామర్గా పనిచేసిన ఆయన తన దగ్గరి మిత్రునితో కలిసి 2020లో ‘ఎన్విజియనార్డ్’ పేరిట కంపెనీని మొదలెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని పూణే, యూఎస్లలో కంపెనీ సేవలందిస్తోంది. ప్రజల కోరికకు తగ్గట్లుగా వారి ఆరోగ్యానికి సరిపడా ఎక్కడ భోజనం లభిస్తుందనే కొత్త అప్లికేషన్ను ఇటీవలే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్లోనూ ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం