ఆ ఊళ్లో అయిదు రోజులు పొయ్యి వెలిగించరు
అక్కడ అయిదు రోజులు ఇంట్లో పొయ్యి వెలిగించరు. టీవీ, సెల్ఫోన్ వినియోగం పెరిగాక పల్లె జనం ఒక చోట చేరి పండగ చేసుకునే రోజులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇందుకు భిన్నంగా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా అయిదు రోజుల పాటు ఊరంతా ఒక చోట చేరి పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు.
కాప్సిలో పంచమి వేడుకలు ప్రారంభం
న్యూస్టుడే, బేల : అక్కడ అయిదు రోజులు ఇంట్లో పొయ్యి వెలిగించరు. టీవీ, సెల్ఫోన్ వినియోగం పెరిగాక పల్లె జనం ఒక చోట చేరి పండగ చేసుకునే రోజులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇందుకు భిన్నంగా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా అయిదు రోజుల పాటు ఊరంతా ఒక చోట చేరి పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏ ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఒకే చోట సహపంక్తి భోజనాలు చేస్తూ దైవరాధనలో నిమగ్నమయ్యారు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కాప్సి(బి) గ్రామస్థులు.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా నేరి గ్రామవాసి నానాజీ మహరాజ్ విఠల్ రుకుంబాయి వీరభక్తుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందగా పాలేరుగా పని చేస్తూ జీవనం సాగించే వారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక చింతనతో గడిపేవారు. ఇలా పలు ప్రాంతాలు తిరుగుతూ వార్దా జిల్లా పెద్ద కాప్సి గ్రామానికి చేరుకుని గురువు విఠల్ రుకుంబాయి ఆలయాన్ని నిర్మించారు. ఆయన బోధనలు నచ్చిన వారు శిష్యులుగా చేరడంతో పాటు మద్యం, మాంసం, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండిపోయారు. ఉమ్రేడ్ గ్రామానికి చెందిన మాయిబాయితో స్థానికులు వివాహం జరిపించారు.
మారిన తీరు
గ్రామానికి చెందిన లక్ష్మణ్ పాటిల్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఎక్కడికి వెళ్లిన వ్యాధి నయం కాలేదు. ఎవరో మహరాజ్ గురించి చెప్పడంతో మహారాష్ట్రలోని పెద్ద కాప్సికి వెళ్లారు. అయిదు రోజుల్లో మామూలు వ్యక్తిగా మారాడు. కొన్నాళ్ల తర్వాత మహరాజ్ను కాప్సి గ్రామానికి ఆహ్వానించగా ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ఆ గ్రామం తీరే మారింది. మహరాజ్ నివసించే గ్రామం పేరు పెద్ద కాప్సి కావడంతో గ్రామానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేకంగా మహరాజ్ దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
సామూహిక భోజనాలు
కాప్సి గ్రామంలో 174 ఏళ్ల కిందట మహరాజ్ ఉగాది రోజున అడుగు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. మహరాజ్ స్వహస్తాలతో ప్రారంభమైన గుడిపడవా వేడుకలు గ్రామస్థుల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతోంది. పదేళ్లుగా అన్నదానం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. మనసులో ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తారు. ఏటా పదుల సంఖ్యలో ముందుకువస్తారు. పంచమి సందర్భంగా గ్రామస్థులు తేదీలను కేటాయిస్తే భోజనం ఏర్పాటు చేస్తారు. అలా అయిదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం కుటుంబ సమేతంగా సామూహిక భోజనాలు చేయడంతో ఆ ఊళ్లో పొయ్యి వెలిగించరు. ఉదయం, సాయంత్రం మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి ఇస్తారు. ఈ నెల 14న ఈ వేడుకలు ముగుస్తాయి. పల్లకీ ఊరేగింపులో వేలాది మంది పాల్గొంటారు.
స్ఫూర్తి బతికే ఉంటుంది
వైద్య విఠల్, శిష్యుడు, కాప్సి
మహరాజ్ లాంటి సంతులు చాలా అరుదు. ప్రజలకు సేవ చేయాలని చెప్పిన బోధనలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. అందరం కలిసి సమష్టి నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. మహరాజ్ స్ఫూర్తి ఎప్పుడూ బతికే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం