సరిహద్దులులేని ‘ప్రేమ’!
ప్రేమకు ఎలాంటి సరిహద్దులుండవని నిరూపిస్తున్నారు నేటి యువత.. ఖండాలు దాటి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
భారత్ అబ్బాయిలు.. విదేశీ అమ్మాయిలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ సాంస్కృతికం : ప్రేమకు ఎలాంటి సరిహద్దులుండవని నిరూపిస్తున్నారు నేటి యువత.. ఖండాలు దాటి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. తమ సహ ఉద్యోగుల ప్రేమలో పడుతున్నారు. ఇంటి పెద్దలను ఒప్పించి, మెప్పిస్తున్నారు. మనసిచ్చిన పడతిని మనువాడుతున్నారు. అంతే కాదండోయ్ విదేశీయులైనప్పటికీ భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో వేద పండితుల వేదమంత్రాల నడుమ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రీ-వెడ్డింగ్, వెడ్డింగ్ ఫిల్మ్ వంటి వాటికి సైతం సై అంటున్నారు. ఇలాంటి వివాహాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని వెలుగు చూశాయి. తాజాగా తెలంగాణ యువకుడు, లండన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఈ కొత్త పోకడలను ఇరు కుటుంబాలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
విస్తరిస్తున్న ట్రెండ్..
వేర్వేరు దేశాలకు చెందిన యువతీ, యువకులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. విదేశీ అమ్మాయిలు ఏకంగా భారత యువకుల మనసులను ఇట్టే దోచేస్తున్నారు. వారి హృదయాలను గెలుస్తున్నారు. ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, కళా, క్రీడా రంగాలలో ఎక్కువగా మనకు ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. చాలావరకు ప్రేమ వివాహాలు వేర్వేరు మతాల వారితోనే జరుగుతున్నాయి.
ఒకరినొకరు అర్థం చేసుకొని..
ప్రేమకు హద్దులుండవు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారీ యువజంట. యువకుడు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ కాగా.. యువతి మయన్మార్ దేశానికి చెందిన జిన్ నెహూ థియేన్(క్యాథరిన్).. ఇద్దరూ ఖతర్ దేశంలో హోటల్ మేనేజ్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని పెద్దలకు వివరించారు. వారి అంగీకారంతోనే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చింతగూడలోని సెయింట్ థామస్ చర్చిలో ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని, ప్రతి మాటకు విలువ ఇవ్వడంతోనే నేడు ఒక్కటయ్యామంటున్నారీ జంట.'
మూడు ముళ్ల బంధంతో ఒక్కటై..
మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్కు చెందిన డయానాని తెలంగాణ సంప్రదాయ రీతిలో వివాహమాడారు. బెల్లంపల్లిలో ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజు మూడేళ్లుగా లండన్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. భారతీయ సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరగాలని డయానా కోరారు. ఆమె కోరిక మేరకు పెద్దలు వివాహం జరిపించారు. తాము వేర్వేరు దేశాలైనప్పటికీ ఒకరినొకరం గౌరవించుకున్నామని, అదే పెళ్లి అయ్యేలా చేసిందంటున్నారు.
సాఫ్టుగా ఒక్కటయ్యారు..
ఆదిలాబాద్కు చెందిన అభినయ్రెడ్డి 2015 నుంచి అమెరికాలోని చికాగోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అదే దేశానికి చెందిన టేలర్ డయానె మర్సోలేక్ మిల్వాకి సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించారు, మెప్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్లో వివాహం చేసుకుని ఏకమయ్యారు. ప్రేమకు భాష, దేశం అడ్డురాదని, తమ మనసుల కలయికతోనే వివాహం చేసుకున్నామంటున్నారీ దంపతులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల