logo

మతోన్మాద శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు.

Published : 12 Apr 2024 12:08 IST

ఎదులాపురం: భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై  ప్రజల్లో  విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడానికి ఈ నెల 13న పట్టణంలోని బీసీ సంక్షేమ భవన్‌లో  సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. భారత రాజ్యాంగం మార్చడానికి  భాజపా  కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. లౌకికవాదులు, మేధావులు, ప్రజలు వామపక్షాల సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని