సైనికుల్లా కష్టపడి ఎంపీగా గెలిపించుకుందాం
నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్
నేరడిగొండ, న్యూస్టుడే : నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. మండల కన్వీనర్ ఆడె వసంత్రావు, బోథ్ బ్లాక్ అధ్యక్షుడు ప్రపుల్చందర్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ అనుపట్ల సంజీవ్ కుమార్, నాయకులు ఏలేటి రాజశేఖర్రెడ్డి, పోతారెడ్డి, కపిల్, నాయిడి రవి, నర్సింగ్, కర్తార్ ఉన్నారు.
బోథ్: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్ అన్నారు. బోథ్లోని షాదీఖానాలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యాన్ని తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లను అందజేశారు. ఏఎంసీ ఛైర్మన్ గంగారెడ్డి, నాయకులు పోతన్న, షేక్ నాజర్, అనిల్, పోతరెడ్డి, సాయన్న, రమేష్, వంశీ, నారాయణ, మహమ్మద్, ఇస్రు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన నాయకులతో శ్రీనివాసరెడ్డి
ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మాజీ సర్పంచులు కినక జుగాదిరావు, కార్యదర్శి గోడం నాగోరావులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం కడెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బొజ్జు వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ముకాడే ఉత్తం, సీనియర్ నాయకుడు మెస్రం నాగ్నాథ్లు పాల్గొన్నారు.
కినక జుగాదిరావు ఈ నెల 8న భారాసకు రాజీనామా చేసి భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ల సమక్షంలో భాజపాలో చేరారు. ఆయనతో పాటు గోడం నాగోరావు సైతం కాంగ్రెస్ పార్టీని వదిలి భాజపాలో చేరినట్లు భాజపా నాయకులు ప్రకటించారు. భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తన బంధువు అని కలిసేందుకు వెళితే భాజపా నాయకులు ఆ పార్టీ కండువాను వేశారని నాగోరావు అన్నారు.
ఎమ్మెల్యే బొజ్జు సమక్షంలో పార్టీలో చేరుతున్న మాజీ సర్పంచులు నాగోరావు, జుగాదిరావు
ఆదిలాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీలో 35వ వార్డు కౌన్సిలర్ ఫౌజియా బేగం భర్త జాఫర్ అహ్మద్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు ఎంఐఎం కార్యకర్తలు, ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకోలి, తంతోలి, కచ్కంటి, జైనథ్ మండలంలోని సాంగ్వి, కరంజి గ్రామాల నుంచి పలువురు పార్టీలో చేరగా నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్రెడ్డి, దిగంబర్రావు పాటిల్, వెంకట్రెడ్డి, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, మంచికట్ల ఆశమ్మ, గంగారెడ్డి, ఆనంద్, సాయిప్రణయ్, లక్ష్మణ్, ఎంఏ షకీల్, చందు, శ్రీలేఖ తదితరులున్నారు.
ఆదిలాబాద్ అర్బన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజాసేవాభవన్లో పార్టీ ప్రచార ప్రతులను ఆవిష్కరించారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక కరపత్రాలను, స్టిక్కర్లను ప్రతి ఇంటికి అందజేయాలన్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసి రానున్న నెలరోజులు ప్రజాక్షేత్రంలోనే ఉండాలన్నారు. పార్టీ నాయకులు గుడిపెల్లి నగేష్, వెంకట్రెడ్డి, గిమ్మ సంతోష్, గంగారెడ్డి, కొండూరి రవి, సుధాకర్గౌడ్, రాజ్ మహ్మద్, ఖయ్యుం, రఫీక్, రాంరెడ్డి, సురేందర్రెడ్డి తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం