విద్యుత్తు వినియోగదారుల పాట్లు
జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరగటం అప్రకటిత కోతలకు దారితీస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరిట తరచూ సరఫరా నిలిపివేస్తున్నారు. నిబంధనలకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
మరమ్మతుల పేరిట తరచూ సరఫరా నిలిపివేత
ఈటీవీ - ఆదిలాబాద్ : జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరగటం అప్రకటిత కోతలకు దారితీస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరిట తరచూ సరఫరా నిలిపివేస్తున్నారు. నిబంధనలకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారికంగా ఎలాంటి కోతలులేవని అధికారులు పైకి చెబుతున్నా అనధికారికంగా అప్రకటిత కోతలు విధిస్తుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఏడీఈలు, ఏఈల పాత్ర అత్యంత కీలకమైనది. కానీ కొంతమంది లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, గ్రామస్థాయిలో పని చేసే తాత్కాలిక ఉద్యోగులపై వదిలేయటంతో సరఫరాలో అంతరాయానికి దారితీస్తోంది.
తప్పిన ప్రమాదం
నిర్వహణ అంటూ ప్రకటించే అధికారులు అసలు లైన్లను పట్టించుకోవటం లేదు. దానికి ఉదాహరణే ఆదిలాబాద్ సీసీఐ సబ్స్టేషన్ నుంచి భీంపూర్ మండలం అర్లి(టి) సబ్స్టేషన్కు వెళ్లే 33 కేవీ లైన్. దాదాపు 40 కిలోమీటర్ల మేర వెళ్లే ఈ లైన్లోని స్తంభాలన్నీ భారీగా గాలివస్తే నేలవాలడం ఖాయంగానే మారింది. నాలుగు రోజుల కిందట జందాపూర్లోని చిల్కూరి దేవన్న పొలంలో విద్యుత్తు స్తంభం రాత్రి నేలవాలడంతో ప్రమాదం తప్పింది. 33 కేవీ లైనంటే 33వేలవాట్ల విద్యుత్తు సరఫరా అన్నమాట. గాలికి స్తంభం వంగి తీగలు నేలకు తగిలితే సరఫరా నిలిచిపోతోంది. ఒకవేళ తీగలు నేలకు తగలనట్లయితే సరఫరా ఉంటుంది. అలాంటప్పుడు రాత్రుల్లో తెలియకుండా అటవైపు వెళ్తే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
ఇదిగో సాక్ష్యం..
ఆదిలాబాద్లోని కలెక్టర్, ఎస్పీ బంగళాలకు సమీపంలో ఉండే కైలాస్నగర్ సబ్ స్టేషన్ పరిధిలో సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. అధికారుల కార్యాలయాలకు అంతరాయం లేకుండా, సాధారణ వినియోగదారులకు సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ నెల 4న సాయంత్రం దాదాపుగా మూడు గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. తాజాగా ఈ సబ్స్టేషన్తోపాటు మావల సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి 10.30 వరకు సరఫరా ఉండదని ప్రకటించిన అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునరుద్ధరించలేదు. ఫలితంగా కైలాస్నగర్, ఖానాపూర్, మావల, రిమ్స్ ఆసుపత్రి ఏరియాల్లో సరఫరా స్తంభించింది. మరోపక్క జైనథ్ మండలం భోరజ్, గిమ్మ, ఆదిలాబాద్ మండలం బంగారిగూడ, పిప్పల్దరి, అంకోలి, ఆదిలాబాద్లోని సీసీఐ, భుక్తాపూర్ సభ్ స్టేషన్ పరిధిలో సరఫరా నిలిపివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు