పురపాలికలకు అమృత భాగ్యం
సమస్యలతో సహవాసం చేస్తున్న పురపాలికల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. తీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాగునీరు, మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం!
ఏపీనగర్లో కాలువ లేక రహదారిపై ప్రవహిస్తున్న మురుగు
భైంసా, న్యూస్టుడే: సమస్యలతో సహవాసం చేస్తున్న పురపాలికల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. తీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. చాలా వరకు శివారుకాలనీల్లో మురుగు నీటి వ్యవస్థ, పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యంలేక ప్రజలు అవస్థల పాలవుతున్నారు. పేదలు నివసించే మురికి వాడల్లోనైతే పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ప్రభుత్వం పురపాలికల అభివృద్ధికి అందించాల్సిన నిధులను విడుదల చేయక స్థానికులు మౌలిక వసతులకు నోచుకోలేక పోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా నిధుల కొరతతో పనులు చేపట్టలేక పోతున్నట్లు వారు చెబుతున్నారు. గతంలో భైంసా పురపాలక సంఘానికి ప్రత్యేకాభివృద్ధి కింద రూ.25కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో శివారు కాలనీల్లో ప్రతిపాదించిన కాలువలు, సీసీ రహదారులు నిర్మించలేదు. పూర్తి స్థాయిలో తాగునీటిని అందించలేక పోతున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన అమృత్ కార్యక్రమంలో గత సంవత్సరం నుంచి పురపాలికల్లో తాగునీటి, మురుగు వ్యవస్థను మెరుగు పరిచేందుకు పురపాలికలకు జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తోంది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి అమృత్ పథకంలో భైంసా, కాగజ్నగర్ మున్సిపాలిటీలకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.62.83 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెప్పారు. దీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భైంసా, కాగజ్నగర్ పురపాలికల్లోని శివారు కాలనీల్లో గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తాగునీటి వసతి కల్పించేందుకు ట్యాంకులు, పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు భూగర్భ కాలువలు, ఉపరితల కాల్వలు, అవసరమైన చోట సీసీ రహదారులు నిర్మించనున్నారు.
మార్గదర్శకాలు రాలేదు
వెంకటేశ్వర్లు, కమిషనర్, భైంసా
అమృత్ పథకంలో గతేడాది అన్ని పురపాలికలకు నిధులు వచ్చాయి. ఆ పథకంలో ప్రతిపాదించిన పనులకు ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. ఇంకా మార్గదర్శకాలు రాలేదు. పనులన్నీ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మిక చట్టాలను కొనసాగించాలి
[ 27-07-2024]
కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు. -
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత