భారాసకు మరో షాక్..!
విపక్ష భారత రాష్ట్ర సమితి (భారాస)కి మరో షాక్ తగిలింది. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: విపక్ష భారత రాష్ట్ర సమితి (భారాస)కి మరో షాక్ తగిలింది. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజులుగా తర్జనభర్జనల నడుమ ఊగిసలాడుతున్న కౌన్సిల్ సభ్యులు ఎట్టకేలకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయంలో స్పష్టత లేకపోయినా.. ఒకప్పటి అధికార భారాసను మాత్రం వీడుతున్నట్లు స్పష్టంచేశారు.
ఊగిసలాట నడుమ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. ఇదివరకు భారాసలో కొనసాగిన చాలామంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నిర్మల్ మండలాధ్యక్షుడు సహా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, భారాస నేతలు అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మరో 13 మంది కౌన్సిలర్లు భారాస సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. వీరిలో చాలామంది కాంగ్రెస్ గూటికి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఇంకొందరు భాజపా వైపు చూస్తున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంలో పూర్తి స్పష్టత లభించనుంది.
సందిగ్ధం.. అల్లోల ఆగమనం
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సైతం భారాసను వీడి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్ర, కేంద్ర నేతల ఆధ్వర్యంలో మంతనాలు కూడా సాగించారని చెబుతున్నారు. ఈనెల 6న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. వాస్తవానికి.. ఆయన అనుచరులు, పార్టీ నేతలు పార్టీని వీడకముందే అందరం కలిసి పార్టీ మారుదామని, తొందరపడొద్దని అల్లోల వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. కానీ, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమైతే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడొచ్చనే భావనతో పలువురు ఆయన సూచనను పట్టించుకోకుండా హుటాహుటిన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇంకొందరు అనుచరులు మాత్రం ఆయన వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క.. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ నాయకులు వరుస ఆందోళనలు చేపట్టారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఇప్పుడిదంతా సద్దుమణిగినా.. అల్లోల చేరిక విషయంలో నెలకొన్న సందిగ్ధత మాత్రం తొలగలేదు. ఆయన పార్టీలో చేరుతారా లేదా, చేరితే ఎప్పుడు జరగొచ్చనే సందేహాలు స్థానికులను తొలచివేస్తున్నాయి.
భిన్న వాతావరణం..
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల విషయం పక్కనపెడితే నిర్మల్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో రెండు స్థానాలు భాజపా గెలుపొందడం గమనార్హం. ఇలాంటి తరుణంలో.. భారాసకు చెందిన వారు పార్టీని వీడే సమయంలో తర్జనభర్జన పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచన చేరడమా, లేక అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమా అనే మీమాంసలో పడుతున్నారు. కాంగ్రెస్లో చేరితే అధికార ఎమ్మెల్యే అండ లభించదు, అలాగని ఎమ్మెల్యే వద్దకు వెళ్తే.. అధికార పార్టీ పట్టించుకోదన్న భావన వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు రాజకీయ అవసరాలు, తమ అనుచరుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం