నూకల బియ్యం.. తినేదెలా?
పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ప్రతి నెలా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. నాణ్యతతో పంపిణీ చేయాల్సిన బియ్యంలో రాళ్లు, రప్పలు, దుమ్ముధూళి, నూకలు.. ఇలా వస్తుండటంతో ప్రజలు వండుకుని తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
సరఫరా అయిన నూకల బియ్యం
నిర్మల్ మండలంలోని ఓ గ్రామంలో చౌకధరల దుకాణానికి సరఫరా అయిన బియ్యం ఇవి. ఇక్కడికి వచ్చిన పలు సంచుల్లోనూ బియ్యం ఇలాగే ఉన్నాయి. నూకలతో కూడినవి రావడంతో వాటిని చూసి లబ్ధిదారులు ఇవేం బియ్యం.. ఎలా తినాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలోనూ పలు చోట్ల ఇలాంటివే వచ్చాయి. మరికొన్ని చోట్ల నాణ్యత లేకుండా దుమ్ముధూళితో ఉన్న బియ్యం వస్తున్నాయి.
నిర్మల్ అర్బన్, న్యూస్టుడే: పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ప్రతి నెలా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. నాణ్యతతో పంపిణీ చేయాల్సిన బియ్యంలో రాళ్లు, రప్పలు, దుమ్ముధూళి, నూకలు.. ఇలా వస్తుండటంతో ప్రజలు వండుకుని తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి నెలా బియ్యం పంపిణీపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో గోదాముల నుంచి నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రేషన్ దుకాణాల నుంచి బియ్యం తీసుకెళ్లడానికి వచ్చిన లబ్ధిదారులు సంచుల్లో ఉన్న బియ్యం చూసి అసలు ఇవి తినేలా ఉన్నాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము ఏం చేయలేమని, గోదాము నుంచి వచ్చిన బియ్యం మీకు పంపిణీ చేస్తున్నామని, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని డీలర్లు సమాధానమిస్తున్నారు. చేసేదేమీ లేక లబ్ధిదారులు నిట్టూర్చూతూనే ఈ బియ్యం తీసుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పంపిణీ దాదాపు చివరి దశకు చేరుకుంది. గత్యంతరం లేక ప్రజలు వాటినే తీసుకెళ్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 412 రేషన్ దుకాణాలు ఉన్నాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రతి నెలా 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు ఇస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. సరఫరా అయ్యే బియ్యం విషయంలో సంబంధితశాఖ అధికారుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన లోపించింది. ఫలితంగా బియ్యం సరిగా లేకపోవడంతో లబ్ధిదారులు తినడానికి ఇష్టపడడం లేదు. గత నెలలోనూ నిర్మల్ పట్టణం, భైంసా, లక్ష్మణచాంద మండలం తదితర చోట్లలోనూ నూకలుగా ఉన్నవి రావడంతో లబ్ధిదారులు వాటిని చూసి నివ్వెరపోయారు. వీటిని వండేదెలా.. తినేదెలా..! అని ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలున్నాయి.
పక్కదారి..
సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా ఇప్పటికే పలు చోట్ల పట్టుబడ్డ వాటి ఘటనలతో వెల్లడైంది. లబ్ధిదారుల నుంచి, ఇతరత్రా మార్గాల్లో పెద్ద మొత్తంలో బియ్యం తక్కువ ధరకు కొందరు కొంటున్నారు. వాటిని పక్కనున్న మహారాష్ట్రకు తరలించేవారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా వాటిని కొందరు లబ్ధిదారులు వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటినే తిరిగి మరోసారి పట్టించి గోదాములకు తరలిస్తున్నారన్న అనుమానాలు లేవనెత్తుతున్నారు. మరోదిక్కు మిల్లర్లు సీఎంఆర్ కోటాను ఎలాగైనా భర్తీ చేయాలనే ఉద్దేశంతో గత వర్షాకాలంలో వచ్చిన ధాన్యం నుంచి తడిసిన నిల్వలనూ మిల్లింగ్ చేసి పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా నూకలతో, ఏ మాత్రం నాణ్యత లేని బియ్యం రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. చౌకధరల దుకాణాలకు పంపించిన వాటిలో 25 శాతం వరకు నూకలతో, తినడానికి వీలులేని విధంగా ఉన్నవి వచ్చాయి. ఇలాంటి వాటిని ఎలా తినగలమని లబ్ధిదారులు నిలదీస్తుండడంతో డీలర్లు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయంపై సంబంధిత పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ను చరవాణిలో ‘న్యూస్టుడే’ సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ