రెండు చోట్ల ఓట్ల లెక్కింపు
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్లను రెండు చోట్ల లెక్కించనున్నారు. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలోని సెంటినరీ కాలనీలో గల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కించి అక్కడే ఫలితాలు వెల్లడించారు.
పార్లమెంట్ ఓట్లు లెక్కించనున్న ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాల ముఖద్వారం
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్లను రెండు చోట్ల లెక్కించనున్నారు. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలోని సెంటినరీ కాలనీలో గల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కించి అక్కడే ఫలితాలు వెల్లడించారు. తాజాగా నిర్వహించే పెద్దపల్లి ఎంపీ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను హాజీపూర్ మండలంలోని ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను గతంలోలా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికల అధికారిగా పెద్దపల్లి పాలనాధికారి ముజమిల్ ఖాన్, మంచిర్యాల జిల్లాకు ఎన్నికల అధికారిగా ఇక్కడి పాలనాధికారి బదావత్ సంతోష్, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఏడుగురు అదనపు పాలనాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులను సహాయ ఎన్నికల అధికారులుగా నియమించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 15,92,996 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 7,87,140 మంది, మహిళలు 8,05,755 మంది, 101 ఇతర ఓటర్లు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో ఈవీఎంలను భద్రపర్చడానికి ఒక్కో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి, రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ, 28న పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నామినేషన్లను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్కడి ఎన్నికల అధికారి స్వీకరిస్తారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేస్తారు. రెండు జిల్లాల్లో వేర్వేరుగా చేసే ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆన్లైన్లో నమోదు చేస్తారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత నియోజక వర్గాల వారీగా నమోదు చేస్తారు. చివరకు ఓట్ల లెక్కింపు ఫలితాలను పెద్దపల్లి జిల్లాలోనే అక్కడి ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయన రాజపత్రం అందజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే