భూసార రక్షణ.. జల సంరక్షణ!
అడవుల నరికివేతతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా వర్షపు నీరు ఆశించిన స్థాయిలో భూమిలో ఇంకడం లేదు.
‘నీటి కుంటల’ నిర్మాణాలతో రైతులకు బహుళ ప్రయోజనం
కాగజ్నగర్ మండలం చింతగూడలో ఫారం పాండ్ పనుల్లో కూలీలు
కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: అడవుల నరికివేతతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా వర్షపు నీరు ఆశించిన స్థాయిలో భూమిలో ఇంకడం లేదు. నేల మీదపడ్డ ప్రతి వాన నీటి బొట్టు కూడా వృథా పోకుండా ఉండేందుకు పలు పద్ధతులు పాటిస్తున్నారు. భూగర్భ జలమట్టం పెరగడానికి వివిధ పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పిస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడానికి సాగు భూముల్లో రైతులకు నయా పైసా ఖర్చు లేకుండా ఫారం పాండ్ (నీటి కుంటలు) నిర్మాణాలు చేపడుతోంది.
జిల్లాలో కొన్నిచోట్ల సాగు భూములు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. ఆర్థిక స్తోమత లేకపోవడం పలువురు రైతులు చదును చేయించుకోలేక పోతున్నారు. దీంతో వాన కాలంలో వచ్చే వరదతో సాగు భూములు కోతకు గురికావడంతో నేల సారం దెబ్బతింటోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పేద రైతుల పాలిట వరంగా మారింది. ఏటా వేసవిలో స్థానికంగా పనులు లేక రైతులతో పాటు కూలీలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పథకం రాకతో కూలీలకు స్థానికంగా చేతినిండా పని లభిస్తుండగా, భూముల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములకు ఈ పథకంలో అడ్డుకట్టలు వేసే పనులతో పాటు ఫారం పాండ్ పనులతో సత్ఫలితాలు వస్తున్నాయి.
బెజ్జూరు మండలంలోని రెబ్బెనలో నీటితో కళకళలాడుతున్న ఫారం పాండ్
కొనసాగుతున్న 210 నీటికుంటల పనులు..
సాగు భూముల్లో ఎగువ ప్రాంతం నుంచి దిగువకు వచ్చే వరదకు అడ్డంగా నీటికుంటలు నిర్మిస్తుండటంతో.. భూసారం కొట్టుకుపోకుండా దోహదపడటమే కాకుండా వర్షపు నీరు ఇందులో నిల్వ ఉంటుండటంతో భూగర్భ జలమట్టం పెరుగుతోంది. ఏటేటా భూసారం పెరుగుతున్నందున పంటల దిగుబడిలోనూ పురోగతి కనిపిస్తోంది. గతంలో పంటల చీడలు సోకకుండా పురుగులమందు చల్లడానికి వాగులు, ఒర్రెల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నీటికుంటలులో వర్షపు నీరు నిల్వ అవుతున్నందున రైతుల కష్టాలు తగ్గాయి. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 234 నీటికుంటలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 210 ప్రారంభించగా.. పనులు కొనసాగుతున్నాయి.
గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక
- సురేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
పట్టాదారు పాసు పుస్తకం, జాబ్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతో రైతులు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. నీటికుంటల మంజూరుకు గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా వీటి నిర్మాణాలను పూర్తి చేస్తాం. వీటి నిర్మాణాలతో అన్నదాతలకు బహుళ ప్రయోజనం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల