వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా!
జిల్లాలో వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చీటీలు కొనసాగిస్తున్న వారి ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. శనివారం ఉదయం ప్రత్యేక బృందాలుగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కలిసి సోదాలు చేపట్టారు.
జిల్లా కేంద్రంలో తనిఖీలు పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, చిత్రంలో డీఎస్పీ సదయ్య, సీఐ సతీష్
ఆసిఫాబాద్, కాగజ్నగర్, వాంకిడి, రెబ్బెన, న్యూస్టుడే : జిల్లాలో వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చీటీలు కొనసాగిస్తున్న వారి ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. శనివారం ఉదయం ప్రత్యేక బృందాలుగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కలిసి సోదాలు చేపట్టారు. ఒక్కసారిగా ఆయా వీధుల్లో పోలీసు వాహనాల సైరన్ మోగి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టడంతో ఇరుగు పొరుగు వారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు చీటీలు నిర్వహించే రిజిస్టర్లు, వడ్డీకి ఇచ్చి రాయించుకున్న ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్లు, చెక్కులు, తెలుపు కాగితాలు, ఖాళీ బాండ్లపై అప్పు తీసుకున్న వారు సంతకాలు పెట్టి ఉన్న పత్రాలు, నగదును స్వాధీనం చేసుకొని వెళ్లిపోయినట్లు తెలిసింది.
అధిక వసూళ్లే కారణమా..?.
జిల్లాలో కొందరు వ్యాపారులు అధిక వడ్డీ డబ్బులు తీసుకొని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. పోలీసు బృందాలు ఇలా ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిసింది. కొందరు వ్యాపారులు వడ్డీ రూ.రెండు నుంచి రూ.అయిదు వరకు వసూలు చేస్తున్నారని, కొందరు తెల్ల కాగితం, ఖాళీ బాండ్ పేపర్లపై అప్పు తీసుకునే వారితో సంతకాలు చేయించి దగ్గర పెట్టుకోవడం, అప్పు వివరాలు నమోదు చేయకపోవడం, ఖాళీ బ్యాంకు చెక్కులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో.. కొందరు సాధారణ కుటుంబాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా కొందరు రిజిస్ట్రేషన్ లేకుండా చీటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో పోలీసులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిసింది.
కాగజ్నగర్లోని ఓ లాడ్జి వద్ద వ్యాపారి పత్రాల పరిశీలన..
ఆసిఫాబాద్లో..
ఆసిఫాబాద్ మండలంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా కొందరు ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించినట్లు సీఐ సతీష్ తెలిపారు. తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 61 ప్రామిసరీ నోట్లు, 32 వివిధ బ్లాంక్ చెక్కులు, 22 అప్పు ఒప్పంద బాండ్ పత్రాలు, ఒకరి నుంచి రూ.14,79,070 నగదు సీజ్ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులపైనే కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.
రూ.23 లక్షల జప్తు
జిల్లాలో వడ్డీ వ్యాపారులు, చీటీలు నడుపుతున్న వారి వివరాలను పోలీసులు ముందుగానే గోప్యంగా సేకరించారు. ఆ వివరాల ప్రకారం సుమారు 15 బృందాలు అదనపు ఎస్పీ ప్రభాకర్రావు నేతృత్వంలో క్షేత్ర స్థాయిలో వెళ్లి తనిఖీలు చేశారు. ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్నగర్, రెబ్బెన.. ఇలా పలు మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలతో పాటు రూ.23 లక్షల నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో జప్తు చేసినట్లు సమాచారం. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. తనిఖీలు చేయడంతో వడ్డీ వ్యాపారులు, చీటీల నిర్వాహకుల్లో గుబులు రేగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు