తేలని ఎంపీ, మాజీ ఎంపీ వైఖరి
ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ భాజపా టికెట్పై ఆశలు పెంచుకున్నా అధిష్ఠానం అనూహ్యంగా భారాసకు చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్ను పార్టీలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా సోయం, రమేష్ రాఠోడ్
ఈటీవీ - ఆదిలాబాద్ : ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ భాజపా టికెట్పై ఆశలు పెంచుకున్నా అధిష్ఠానం అనూహ్యంగా భారాసకు చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్ను పార్టీలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. అప్పటి నుంచి వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది రాజకీయ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే మూడు పార్టీల తరఫున అభ్యర్థిత్వాలు ఖరారు కావటంతో మార్చే పరిస్థితి లేదు. ఒకవేళ సోయం బాపురావు, రమేష్ రాఠోడ్ పోటీ చేయాలంటే స్వతంత్ర అభ్యర్థులుగానో, లేదా ఏదైనా పార్టీ తరఫున పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఎన్నికల బరిలో నిలిస్తే ఏ పార్టీకి కలిసి వస్తుంది. ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనే చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ ఇదే చివరిది. వచ్చే 2026లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం జనరల్గా మారే అవకాశం ఉంది. ఫలితంగా ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, భారాస తరఫున బరిలో ఉన్న ఆత్రం సుగుణ, గోడం నగేష్, ఆత్రం సక్కుకు ఈ ఎన్నిక అత్యంత కీలకం. ప్రధాన మంత్రి మోదీ చరిష్మా, హిందూత్వ నినాదంపై భాజపా ఆధారపడి పని చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రభావం, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్లో ధీమా కనిపిస్తోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భాజపా, కాంగ్రెస్ కంటే అధికంగా ఓట్లు రావటం, ఆ రెండు పార్టీల నేతల్లో బయటపడుతున్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవాలని స్వయంగా కేసీఆర్, కేటీఆర్ పావులు కదుపుతున్నారు. గెలుపోటములపై మూడుపార్టీలు మూడు రకాలుగా వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నా సోయం బాపురావు, రమేష్ రాఠోడ్ వైఖరిపై ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమవుతోంది.
చర్చనీయాంశంగా గైర్హాజరు..
ఆదిలాబాద్లో శనివారం భాజపా నిర్వహించిన పార్లమెంటు క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. వారికి సమాచారం ఇవ్వలేదా? ఇచ్చినా రాలేదా? అనే విషయం పార్టీ వర్గాలు సైతం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా సోయం బాపురావు, రమేష్ రాఠోడ్ సమన్వయంతో ప్రచారం చేయాలని రాష్ట్ర, జాతీయ నాయకత్వం సూచనలను స్థానిక నేతలు పట్టించుకోవటం లేదనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. పలకరింపులే తప్పితే పట్టించుకోవటం లేదనే అసంతృప్తి సోయం, రమేష్ రాఠోడ్, బాపురావు అనుచరుల్లో నెలకొంది. ఫలితంగా వారి నిర్ణయం ఎటువైపు దారితీస్తుందనే దాని కోసం కాంగ్రెస్, భారాస అధిష్ఠానాలు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం