మార్కెట్ మాయ
ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు. నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఒక వేళ విక్రయించకుండా.. ఇళ్లల్లో నిల్వ చేసుకొని వేచి చూస్తే ధరలు పెరుగుతాయనే భరోసా లేదు. చేతికివచ్చిన పంటను ధర లేనప్పుడు దాచుకొని, అవసరమైనప్పుడు
అన్నదాతనుంచి చేజారాక.. లాభాల ఒరవడి
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
కంది, సోయా
ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు. నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఒక వేళ విక్రయించకుండా.. ఇళ్లల్లో నిల్వ చేసుకొని వేచి చూస్తే ధరలు పెరుగుతాయనే భరోసా లేదు. చేతికివచ్చిన పంటను ధర లేనప్పుడు దాచుకొని, అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలు లేక ఎక్కువమంది రైతులు పంటచేతికి రాగానే అమ్మేస్తుంటారు. మొన్నటివరకు మద్దతు ధర కూడా దక్కని పత్తి ధర తాజాగా క్వింటాలకు రూ.1000 పెరిగింది. ఏడు వేలు కూడా దాటని కందుల ధర తాజాగా రూ.11 వేలకు చేరుకుంది. రైతుల చేతిలో ఉన్న సమయంలో పెరగని పంటల ఉత్పత్తుల ధరలు పంటను విక్రయించాక నెలరోజుల వ్యవధిలో అనుహ్యంగా పెరిగిపోయాయి. జిల్లాలో నెల రోజుల కిందట రైతులు విక్రయించిన నాటి ధరలతో ప్రస్తుత ధరలను పోల్చితే ఎంత నష్టపోయారనేది తెలిసిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలను లెక్కిస్తే.. జిల్లా మొత్తంలో దాదాపు రైతులు రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
పత్తి, శనగ
మార్కెట్ మాయాజాలంతో ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు నష్టపోతుంటే.. అవే పంటలు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. కొనుగోళ్ల సీజన్లో తక్కువగా ఉండే పంట ఉత్పత్తుల ధరలు క్రయవిక్రయాలు ముగిసే సమయంలో అమాంతంగా పెరిగిపోతున్నాయి. వాస్తవానికి రైతులు పంట ఇంటికి రాగానే అవసరాలకు ఆ సమయంలో ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్ముకుంటారు. ఏ కొద్ది మందో తప్ప చివరి వరకు ఇళ్లల్లో నిల్వ చేసుకొని.. ధర పెరుగుతుందని ఎదురుచూసే వారు తక్కువే. తీరా ధర పెరుగుతుందని ఇళ్లల్లో నిల్వ చేసుకుంటే.. మార్కెట్ పరిస్థితులపై అవగాహన లేని అన్నదాతలు నష్టపోతున్నారు.
జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన ఈ రైతు పేరు జక్కుల శ్రీనివాస్. తనకున్న నాలుగు ఎకరాల్లో సోయా, కంది అంతర పంటగా సాగు చేస్తే.. కాలం కలిసి రాక 13 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు అప్పట్లో రూ.7,200 ధర ఉంది. మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువే ఉండటంతో విక్రయించాడు. ఇప్పుడు అదే కంది పంట నెల రోజుల్లోనే క్వింటాలుకు రూ.11 వేలకు చేరుకుంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.3,800 చొప్పున 13 క్వింటాళ్లకు రూ.49,400 రైతు నష్టపోయాడు.
తానూర్కు చెందిన ఈ రైతు పేరు గణేశ్. తనకున్న అయిదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ.7,020 ఉంది. ప్రైవేట్లో క్వింటాలుకు రూ.6,700లకు విక్రయించాల్సి వచ్చింది. కొంతమంది రైతులు ధర పడిపోతుండటంతో సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. 8 శాతం తేమ ఉన్న రైతులకు మద్దతు ధర ఇవ్వగా, చాలామందికి మద్దతు ధర కూడా దక్కలేదు. తాజాగా ప్రైవేటులోనే పత్తి ధర క్వింటాలుకు రూ.7,700లకు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి