బాప్రే.. బంగారం..!
బంగారం.. అన్నివర్గాల ప్రజలకు.. ప్రధానంగా అతివలకు ఇష్టమైన అంశం. నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు
ఎక్కడ చూసినా ఇదే చర్చ
రూ. 75 వేలు దాటిన 10 గ్రాముల ధర
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: బంగారం.. అన్నివర్గాల ప్రజలకు.. ప్రధానంగా అతివలకు ఇష్టమైన అంశం. నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు. ఇంట్లో ఆడపిల్లలుంటే ముందు నుంచే కొద్దికొద్దిగానైనా పోగు చేస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటపుడు నగానట్రా లేకుంటే అసంతృప్తికి గురవుతుంటారు. ఆడవారికి పసిడితో ఉన్న బంధాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఎవరికీ మింగుడుపడడం లేదు. కొంత కొందామన్నా అందనంత ఎత్తుకు ధర వెళ్తుండటంతో బాప్రే! బంగారం అంటూ బాధపడుతున్నారు. 10 గ్రాముల ధర ఏకంగా రూ.75 వేలు దాటడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ కనిపిస్తోంది.
ఇదీ సంగతి..
బంగారం ధరలపై చాలామందికి అవగాహన ఉండదు. ఎందుకు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంతుపట్టదు. మనం నిత్యం వాడే సరకులు, వస్తువుల ధరలు స్థానికంగా ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. బంగారం మాత్రం అంతర్జాతీయ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ద్రవ్య మారకపురేటు పైన ధర ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవహారాల కోసం చెలామణిలో ఉన్న ద్రవ్య ప్రవాహం సైతం ప్రభావితం చేస్తుంది. మనదేశంలో పసిడిని ఆభరణ వస్తువుగా చూడటం కూడా ధరల పెరుగుదలకు కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు రావడం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, వ్యాపార ఒడంబడికలు విచ్ఛిన్నమవడం, ఎగుమతులు-దిగుమతుల సుంకాల్లో హెచ్చుతగ్గులు, ద్రవ్య ముద్రణ నియమాలు, చమురు దేశాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన సందర్భాల్లోనూ స్వర్ణం ధరలో మార్పులు చోటుచేసుకుంటాయి.
వెండి తక్కువేం కాదు..
బంగారం ధర విపరీతంగా పరిగెడుతుంటే వెండి సైతం తానేం తక్కువ కాదంటూ ఉరకలెత్తుతోంది. అయిదేళ్ల క్రితం కిలో వెండి ధర రూ. 50 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.84,000కు చేరింది. సామాన్యుల బంగారంగా పిలిచే ఈ రజతం వారికి అందకుండా పోతోంది. ముఖ్యంగా దీనిని కాళ్లపట్టీలు, మెట్టెలు, పిల్లల మొలతాళ్లకు అధికంగా వినియోగిస్తుంటారు. వీటికీ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎటొచ్చీ.. ‘వారికే’ ఇబ్బంది
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా పసిడి పరిగెత్తి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న స్వర్ణకారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్ద పట్టణాల్లో మెగా షోరూముల్లో ధరలు పెరిగినా గిరాకీలపై అంతగా ప్రభావం కనిపించడం లేదు. ఎన్నారైలు, ధనవంతులు తమ అవసరాలకు అనుగుణంగా ఇప్పటికీ కొనుగోళ్లు చేస్తున్నారు. సాధారణ కుటుంబాల వారు పెరిగిన బంగారం ధరను అందుకోలేక అక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటి వారు కొనుగోలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో చిరు దుకాణాలు నిర్వహించే స్వర్ణకారుల ఉపాధికి గండం వాటిల్లుతోంది.
గల్ఫ్లో ధర తక్కువా!?
నిర్మల్ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య 20 వేలకు పైగానే ఉంటుంది. అక్కడి బంగారం నాణ్యంగా ఉంటుందని, ధర కాస్త తక్కువేనన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో అధికôగా ఉంటుంది. అసలు దీని సంగతేంటని పరిశీలిస్తే.. ఉదాహరణకు.. దుబాయ్ ద్రవ్య ప్రమాణం దిరమ్. ప్రస్తుతం ఒక దిరమ్ మన దేశ ద్రవ్యప్రమాణాలలో రూ.22.40కి సమానం. పైగా అక్కడ మామూలు బంగారు బిస్కట్గా కొనుగోలు చేసే దానికన్నా ఆభరణాల రూపంలో కొంటే ధర తగ్గుతుంది. ఆ కారణంగా అక్కడ కొనుగోలు చేస్తే ధర కాస్త తక్కువగా ఉంటుంది. అది మన దగ్గరకు తీసుకొచ్చేసరికి కొద్దిగా వ్యత్యాసం ఏర్పడుతుంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పరిమిత పరిమాణంలో మాత్రమే అక్కడ నుంచి మన దేశానికి బంగారం తీసుకొచ్చేందుకు అనుమతి ఉంటుంది. ఆభరణం రూపంలో ఉన్న పసిడినే అధికారికంగా తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ నికర బంగారాన్ని తెస్తే మన ధరకు అక్కడి ధరకు దాదాపు సమానంగానే ఉంటుంది.
వ్యాపారులకు నష్టమే: రఘువీర్, ఆభరణాల వ్యాపారి, నిర్మల్
పెరిగిన ధరలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులకూ నష్టంగా మారింది. ఒకరోజు వ్యవధిలోనే రెండు, మూడుసార్లు ధరల్లో వ్యత్యాసం రావడంతో ఆ తేడా ఒక్కోసారి మాపై భారంగా మారుతోంది. ఆభరణాల తయారీ కోసం కొన్ని సందర్భాల్లో వినియోగదారులకు విక్రయించిన ధరకన్నా అధికంగా చెల్లించి బంగారం కొనాల్సివస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొనుగోళ్లు గణనీయంగా పడిపోతాయి. వ్యాపారులకే కాదు స్వర్ణకారులకూ ఉపాధి దెబ్బతింటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మిక చట్టాలను కొనసాగించాలి
[ 27-07-2024]
కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు. -
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్