ఎన్నికల సమర శంఖారావం..
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది.
నేటినుంచి నామపత్రాల స్వీకరణ
ఓటర్లు 16,44,715.. పోలింగ్ కేంద్రాలు 2,199
ఈటీవీ - ఆదిలాబాద్
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గత ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్ నియోజకవర్గం మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్ల అనుబంధ జాబితా ఈ నెల 25న వెల్లడికానుంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో గురువారం నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది. ఏప్రిల్ 26న నామపత్రాల పరిశీలన, 29న నామపత్రాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మే 13న పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,111 పోలింగ్ కేంద్రాలను యంత్రాంగం ఎంపిక చేసింది. కానీ కొన్ని చోట్ల 1,500 మంది కంటే పైబడి ఓటర్లున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని అదనంగా మరో 88 సహాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సైతం ఎన్నికల కమిషన్ అనుమతించింది. వీటితోకలిపి మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,199 అన్నమాట. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆలోచనలతో అధికారిక సమీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్న అధికార యంత్రాంగం కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ శాతం పెంపుదల తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో కాస్త వెనుకబడే ఉంది.
నామినేషన్ల స్వీకరణ కోసం కలెక్టరేట్ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి రాజర్షిషా, ఎస్పీ గౌష్ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తదితరులు
మావోయిస్టులపై పోస్టర్లు..
‘మావోయిస్టుల సమాచారం మాకు. బహుమతి మీకు’ అంటూ సిరికొండ మండలం చెమ్మన్గూడలో పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. అసలు మావోయిస్టుల ప్రాబల్యమే లేదని ప్రకటిస్తూనే మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచారు. మొత్తం 2,199 కేంద్రాలకుగాను 132 ప్రాంతాల్లోని 252 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. పార్లమెంటు స్థానం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహణకు అవకాశం ఉంటే ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే అనుమతి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల