గౌతమ్.. నన్ను మన్నించురా...
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
గౌతమ్.. నన్ను మన్నించురా...
అనుకోలేదు.. నా ఆయువు అర్ధాంతరంగానే ముగుస్తుందని..
చిన్నతనంలోనే అమ్మప్రేమకు దూరం అయ్యావురా..
పాలవాసనలు ఇంకా ఆరనేలేదు..
ముక్కుపచ్చలారని పసివాడివిరా..
కాసేపు కన్పించకుంటేనే తల్లడిల్లే వాడివి..
నూరేళ్లు తల్లిప్రేమకు కరవైతివి.
ఆకలేస్తే అమ్మ.. అమ్మా అంటూ పిలిచేవాడివి..
ఇప్పుడు ఏట్లారా.. గౌతమ్..
తలచుకుంటునే నరకం కనిపిస్తుంది..
అమ్మ..అమ్మ అని పిలుస్తుంటేనే గుండెలు పగులుతున్నాయి..
అంబులెన్సు చుట్టూ తిరుగుతుంటే..
నా కన్నులు చెమ్మగిల్లాయి..
అమ్మ కోసం అక్కడి వారిని అడుగుతుంటే..
బతికితే బాగుండు అనిపించింది నాన్న..
ఏం చేద్దాం.. ఆ మృత్యువు కరెంటు రూపంలో నన్ను కబళించింది..
నీ లాలన ఎవరు చూస్తారో..
నీకు లాలా ఎవరు పోస్తారో..
కళ్లల్లో నీరూపం నింపుకొని లోకం వీడుతున్నా..
నాలుగేళ్ల వయసులోనే నిన్ను ఒంటరిని చేసినందుకు..
నన్ను క్షమించురా బిడ్డా..
కాసిపేట, బెల్లంపల్లి గ్రామీణం న్యూస్టుడే: మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామానికి చెందిన బెడ్డల మౌనిక(26)ను బుధవారం ఇంట్లో వస్త్రాలు శుభ్రం చేస్తున్నారు. ట్యాంకు నుంచి నీరు రాకపోవడంతో నిచ్చెన సహాయంతో రేకులపైకి వెళ్లారు. అయితే ఇంట్లోకి వచ్చే తీగ తెగి రేకులకు విద్యుత్తు సరఫరా అయ్యింది. మౌనిక విద్యుదాఘాతానికి గురై రేకులపై పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. పైకి వెళ్లిన తల్లి ఎంతకీ కిందకు రాకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కి నాలుగేళ్ల కుమారుడు గౌతమ్ చూడగా రేకులపైన పడిపోయి కనిపించింది. వెంటనే పెద్దనాన్నకు సమాచారం ఇవ్వడంతో రేకులపైకి వెళ్లిన ఆయనకు సైతం విద్యుత్తు సరఫరా అయ్యింది. కింద ఉన్న వారు వెంటనే సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. అనంతరం మౌనికను కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు.
తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న కుమారుడు గౌతమ్
ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే..
మౌనిక తల్లి రెండేళ్ల కిందట మృతి చెందింది. ఇంట్లో పనులు చేసేందుకు మూడు రోజుల కిందట ముత్యంపల్లిలోని తల్లిగారి నివాసానికి మౌనిక వెళ్లింది. బుధవారం శ్రీరామ నవమి కావడంతో ఉదయాన్నే అత్తగారి ఇంట్లో మౌనికను తండ్రి దింపివేసి వెళ్లారు. కొద్దిగంటల్లోనే కుమార్తె మరణ వార్త రావడంతో తండ్రి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఆమెకు భర్త రాజేశ్, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల