దూరంగా జలాలు.. తాగునీటి తంటాలు
కడెం జలాశయం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా అయిదు మండలాల్లోని సుమారు 300 గ్రామాలకు తాగు నీరందించాలనే లక్ష్యం ఉంది. కొన్ని గ్రామాలకు ఆయా కారణాలతో నీరందడం లేదు.
300 గ్రామాలకు కష్టాలు
కడెం జలాశయంలో మిషన్ భగీరథ ఇన్టేక్వెల్కు దూరంగా జలాలు
కడెం, న్యూస్టుడే: కడెం జలాశయం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా అయిదు మండలాల్లోని సుమారు 300 గ్రామాలకు తాగు నీరందించాలనే లక్ష్యం ఉంది. కొన్ని గ్రామాలకు ఆయా కారణాలతో నీరందడం లేదు. కానీ చాలా గ్రామాలకు నీటిసరఫరా చేస్తున్నారు. అయితే కడెం జలాశయంలో నీటిమట్టం కనిష్ఠ స్థాయి కన్నా దిగువకు తగ్గిపోవడంతో మిషన్ భగీరథ పథకానికి నీరందించేందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వేసవి కావడంతో నీటిసరఫరా లేకుంటే జనాలు అల్లాడే పరిస్థితి ఉంది. దీంతో జలాశయంలో దూరంగా ఉన్న నీటిని ఇన్టేక్ వెల్ వరకు తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు.
కనిష్ఠం కన్నా దిగువకు
జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రధాన కాలువ బెడ్లెవల్ 675 అడుగులు. అంతకన్నా తక్కువకు నీటిమట్టం తగ్గిపోతే అటు సాగునీటికి, ఇటు తాగునీటికి అందకుండా పోతుంది. తాగునీరు అందకుండా పోయే పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఎదురవుతుంది. ప్రస్తుతం కనిష్ఠానికి తక్కువగా 672 అడుగులకు పడిపోవడంతో జలాశయం బురదమట్టి తేలి బోసిపోయి కనిపిస్తోంది. భగీరథ పథకం మొదలయ్యాక 2019లో ఇలాగే 672 అడుగులకు నీటిమట్టం పడిపోవడంతో అధికారులు అపుడు ఇన్టేక్వెల్ నుంచి నీటిమట్టం ఉన్నవరకు కాలువ తీసి రెండు రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేశారు. అపుడు తీసిన కాలువ కొంతమేర అలాగే ఉండడంతో అందులోంచి నీరొస్తుంది. రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుండడంతో మిషన్ భగీరథ అధికారులు కాలువలో పేరుకుపోయిన మట్టిని కూలీలతో తొలగింపజేసి బావి వరకు నీరొచ్చేలా చేస్తున్నారు. ఆదివారం పొడవాటి తొండం ఉన్న పొక్లెయిన్తో కాలువను మరింత లోతుగా తీయించారు. ఎంతదూరం వీలైతే అంతదూరం ఇలా కాలువను వెడల్పు చేసి భగీరథ పథకం బావి వరకు నీరొచ్చేలా చేసి నల్లా నీటికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు పెద్దగా వర్షాలు కురిసి వరద నీరు వస్తేకాని మిషన్ భగీరథ పథకానికి ఈ ఇబ్బంది తప్పేలా లేదు.
అయిదేళ్ల తర్వాత సమస్య పునరావృతం
కడెం జలాశయంలో నీటిమట్టం అయిదేళ్ల క్రితం 2019లో ఇలాగే కనిష్ఠంకన్నా దిగువకు పడిపోయింది. అపుడు నీటిమట్టం మే 31 వరకు 672 అడుగులుగా ఉంది. ఆతర్వాత వచ్చిన వరదలతో మట్టం పెరిగింది. 1998, 2010, 2015, 2016ల్లోనూ ఇలాగే కడెంలో నీటిమట్టం 672అడుగులకు పడిపోయి జలాశయం బోసిపోయి కనిపించింది. అపుడు సైతం కడెం వాసులకు తాగునీటికి తిప్పలు తప్పలేదు. ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాలకు తాగునీటినందించే మిషన్ భగీరథ పథకం ఇక్కడ ఉండటంతో మరికొద్ది రోజులు వర్షాలు కురవకున్నా పథకానికి నీరందేలా అధికారులు ఇన్టేక్ వెల్కు నీరొచ్చేలా కూలీలు, పొక్లెయిన్ సాయంతో బురదలోనూ కాలువ తీస్తూ నీరందేలా చూస్తున్నారు. ఇపుడు తీసిన కాలువతో మరో 15 రోజుల వరకు భగీరథ పథకానికి నీరందే అవకాశం ఉందని, అప్పటికీ వర్షాలు వస్తే ఇబ్బంది తొలగుతుందని ఆశిస్తున్నామని భగీరథ డీఈఈ వెంకటరమణ ‘న్యూస్టుడే’కు చెప్పారు. ఇపుడైతే రోజూ నీటిసరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే