ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు
ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అశిష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కిపు (కౌంటింగ్) అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్, చిత్రంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అదనపు పాలనాధికారులు కిషోర్కుమార్, శ్యామలాదేవి
నిర్మల్, న్యూస్టుడే: ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అశిష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కిపు (కౌంటింగ్) అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్ 4న ఆదిలాబాద్ ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాలలో ఉంటుందని, కౌంటింగ్ అధికారులు ఆ రోజు ఉదయం 5.30 గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రారంభించాలని, అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించాలని, ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలను తెలిపేందుకు స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్వోలకు సమాచారం అందించాలని, రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత ఫారాలు జాగ్రత్తగా నింపాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్లు ఓట్ల లెక్కింపు సరళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను వివరించారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అదనపు పాలనాధికారులు కిషోర్కుమార్, శ్యామలాదేవి, నిర్మల్, భైంసా, ఉట్నూరు ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్రెడ్డి, జివాకర్, అధికారులు ల్గొన్నారు.
దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్
నిర్మల్: జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జిల్లా పాలనాధికారి అన్నారు. సోమవారం దిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘ ముఖ్య కమిషనర్ రాజీవ్కుమార్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సూచనలు చేశారు. అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్లో జరుగుతుందని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఇందులో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, అధికారులు, తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్