అంతరాయాలు ఆగినట్టేనా?
వేసవి తీవ్రతతో భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం అవుతోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు ఆ సంస్థ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. ఈ ఏడాది మొదట్లో తరచూ ఇష్టారీతిన సరఫరా నిలిపివేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి.
విద్యుత్తు సంస్థ ప్రత్యేక కసరత్తు పూర్తి
జీజీహెచ్, ఎంసీహెచ్లలో విద్యుత్తు సరఫరాపై పర్యవేక్షణాధికారితో చర్చిస్తున్న విద్యుత్తు సంస్థ జిల్లా ప్రత్యేక బృందం
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే : వేసవి తీవ్రతతో భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం అవుతోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు ఆ సంస్థ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. ఈ ఏడాది మొదట్లో తరచూ ఇష్టారీతిన సరఫరా నిలిపివేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఆ లెక్కలు చూస్తే జిల్లానే మొదటిస్థానంలో ఉండటంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ అసహనం వ్యక్తం చేసి ప్రత్యేక దృష్టిసారించారు. అందుకు తగ్గట్లుగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారిపైనే వేటు వేసి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అంతరాయాన్ని తగ్గించేందుకు సలహాలు, సూచనలు తెలియజేశారు. దీంతో కొన్నిరోజులుగా జిల్లా సిబ్బంది ఇబ్బందులను గుర్తించడంలో నిమగ్నమైంది. నిరంతర సరఫరాకు అవసరమైన చర్యలకు సిద్ధమైంది.
క్షేత్రస్థాయిలోనే జిల్లా ఉన్నతాధికారి..
ఇటీవల నూతన ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్కుమార్ జిల్లాపై మరింత శ్రద్ధ పెట్టారు. కొద్దిరోజులుగా పూర్తి సమయాన్ని కేటాయిస్తూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. స్వయంగా పరిశీలిస్తున్నారు. వాడకం పెరిగినా.. తగ్గినా.. వర్షాలు వచ్చినా.. గాలులు వీచినా సరఫరాలో ఏ మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడూలేనివిధంగా ముందస్తుగా జిల్లాలో పదిరోజులపాటు అంతరాయం వివరాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేసి మరమ్మతుల పనులు చేపట్టారు. పదిరోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రతిఫలం లభించినట్లు కన్పిస్తోంది. నిత్యం ఇదే తీరుతో మెరుగైన సేవలందిస్తారా అనేది చూడాలి మరీ..
సర్కారు ఆసుపత్రుల్లో అప్రమత్తం
ఇటీవల ఎంజీఎం(వరంగల్) ఆసుపత్రిలో జరిగిన సంఘటనతో జిల్లాలోనూ విద్యుత్తు సంస్థ అప్రమత్తమైంది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఇక్కడి సర్కారు ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరా తీరును పరిశీలించడం ప్రారంభించారు. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు బృందంగా ఏర్పడి విద్యుత్తు తీగలు, నియంత్రికలు పరిశీలించారు. పెద్దాసుపత్రుల్లోని వార్డులు కలియతిరుగుతూ విద్యుత్తు వినియోగంపై ఆరా తీస్తూ పర్యవేక్షకులతో సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి పరిస్థితిని గమనించి అంతరాయం కలిగించే అంశాలపై అప్రమత్తత చేసేలా అవసరమైన సలహాలిచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సమాచారం అందించాలని, తమ సిబ్బంది తోడ్పాటుతో సరఫరాకు ఆటంకం కలగకుండా చూద్దామంటూ భరోసానిచ్చారు.
సరఫరాకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు
- శ్రావణ్కుమార్, జిల్లా విద్యుత్తు సంస్థ పర్యవేక్షక ఇంజినీరు
గత పక్షం రోజులకు పైగా విద్యుత్తు అంతరాయం, సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాం. వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాం. ఇబ్బంది కలిగిస్తూ వేలాడుతున్న తీగలన్నీ దాదాపు సరిచేశాం. నియంత్రికలను పరిశీలిస్తూ కాలంచెల్లిన వాటిని తొలగించాం. అవసరమైన చోట నూతనంగా ఏర్పాటు చేశాం. ఉపకేంద్రాలను పరిశీలించి, అధిక లోడు పడుతున్న ఫీడర్లను ఉన్నతీకరించాం. జిల్లా వినియోగదారులకు ఇక ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు, మెరుగైన సేవలు అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?