అనిశా దూకుడు!
స్టేషన్ బెయిల్ కోసం ఆసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు తీసుకుంటుండగా.. గత నెలలో అనిశా అధికారులకు చిక్కారు. నాలుగు వరుసల రహదారి పరిహారం చెల్లింపుల్లో భాగంగా గత నెల నుంచి అనిశా అధికారుల విచారణ.. జిల్లాలో కొనసాగుతోంది.
వరుస దాడులతో.. అక్రమార్కుల్లో వణుకు
స్టేషన్ బెయిల్ కోసం ఆసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు తీసుకుంటుండగా.. గత నెలలో అనిశా అధికారులకు చిక్కారు. నాలుగు వరుసల రహదారి పరిహారం చెల్లింపుల్లో భాగంగా గత నెల నుంచి అనిశా అధికారుల విచారణ.. జిల్లాలో కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.4 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారనే అభియోగంతో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో మూడు రోజుల నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటూ వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులతోపాటు, స్థిరాస్తి వ్యాపారులపై కేసు సైతం సైతం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరందరూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లుగా సమాచారం.
ఈనాడు, ఆసిఫాబాద్: కాసులకు అలవాటుపడిన అధికారులపై వల విసురుతూ, పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగించడంతోపాటు, నెల రోజుల వ్యవధిలోనే.. జిల్లాలోని ఇద్దరు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారుల దూకుడు కొనసాగుతోంది. విచారణ సాగుతున్న ఓ కేసులో నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైదరాబాద్లో ప్రయత్నాలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. వ్యవసాయశాఖలో కలుపు మొక్కలుగా మారిన ఓ అధికారి ఎరువుల దుకాణం రెన్యూవల్ కోసం రూ.38 వేలు తీసుకుంటూ తాజాగా అనిశా అధికారులకు చిక్కగా.. ఎరువుల దుకాణాల అనుమతులను రెండేళ్ల నుంచి పునరుద్ధరణ చేయని జైనూర్ ఏఓ ఈ నెల ఒకటో తేదీన సస్పెండ్ అయ్యారు.
జిల్లాలో అధికారికగా 349 ఎరువుల దుకాణాలు ఉండగా.. పల్లెల్లో విచ్చలవిడిగా ఎరువుల దుకాణాలు వెలుస్తున్నాయి. పురుగుమందుల గురించి కనీస అవగాహన లేని నిర్వాహకులు.. అమాయక రైతులను నట్టేట ముంచుతూ అధిక ధరలకు ఎరువులను అంటగడుతున్నారు. డీలర్లకు సైన్సులో డిగ్రీ లేదా వ్యవసాయ డిగ్రీ అర్హత తప్పనిసరై ఉన్నా.. చాలా చోట్ల ఈ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దుకాణాలను ఏటా రెన్యూవల్ చేయాల్సి ఉండగా.. సంబంధిత అధికారులు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్లలో ఎరువుల దుకాణాలను ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి, లింగాపూర్ మండలాల్లో అధిక ధరలకు, అధిక మోతాదులో ఎరువులను విక్రయిస్తూ అన్నదాతలను నిలవుదోపిడీకి గురి చేస్తున్నారు.
అధికారులు అలా.. దుకాణదారులు ఇలా..
ఎరువులు, పురుగుమందులతోపాటు, విత్తన విక్రయాలకు సంబంధించి రెండు వేర్వేరు లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది దుకాణదారులు ఏదో ఒక లైసెన్స్తో నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సంబంధిత అధికారులు.. రెన్యూవల్ విషయంతో పాటు, అధిక ధరల విక్రయాలను నిరోధించలేకపోతున్నారు. ఏ దుకాణంలో ఎంత మేరకు విత్తన, ఎరువుల నిల్వలు ఉన్నాయి, ఏ రకం ఎంత ధర అనే బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో అన్నదాతలకు అరువుపై విత్తనాలు, ఎరువులను ఇస్తున్న యజమానులు.. వారి ఇష్టానుసారంగా, అధిక లాభాలు గడించే వాటినే అంటగడుతున్నారు.
గతంలో దహెగాం మండలంలో పట్టుబడిన ముగ్గురు అధికారులు
దహెగాం: మండలంలో ఇద్దరు తహసీల్దార్లు ఒక వ్యవసాయాధికారి పట్టుబడ్డారు. 24-4-2013లో తహసీల్దార్ అమృతసాగర్ కాగజ్నగర్ తన నివాసంలో లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. మరో తహసీల్దార్ విశ్వంబర్ 2-5-2016లో తన నివాసంలో లంచం తీసుకుని చిక్కాడు. తాజాగా వ్యవసాయాధికారి మండలకేంద్రంలో లంచం తీసుకుంటున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు.
గతంలోనూ సస్పెండయ్యారు..
ఎరువుల దుకాణం పునరుద్ధరణకు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన దహెగాం ఏఓ వంశీకృష్ణ.. ఆది నుంచి ఇదేతీరుతో దారి తప్పి వ్యవహరిస్తున్నారు. 2019లో మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏఓగా పనిచేస్తున్న క్రమంలో.. రైతుబీమా పరిహారం మంజూరులో సైతం బాధితుల నుంచి ముడుపులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే ‘ఈనాడు’ బహిర్గతం చేయగా, అప్పటి పాలనాధికారి భారతీ హోళ్లికేరి స్పందించి విచారణ చేశారు. డబ్బుల వసూళ్ల గురించి బాధితులు పూర్తి వివరాలు వెల్లడించడంతో మరో ఇద్దరు వ్యవసాయ శాఖాధికారులతోపాటు, వంశీకృష్ణ సస్పెండయ్యారు. అనంతరం మూడేళ్ల తరువాత 2022లో దహెగాం మండల ఏఓగా బాధ్యతలు స్వీకరించినా మళ్లీ బుద్ధిమారక లంచాలు తీసుకుని అనిశాకు చిక్కారు.
నిర్భయంగా అనిశా అధికారులను సంప్రదించవచ్చు
ఏ అధికారి అయినా లంచం తీసుకుంటే నిర్భయంగా అనిశా అధికారులను సంప్రదించవచ్చని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అవినీతి జరుగుతుందని తెలిస్తే 1064, 91543 88954, 91543 88963 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మిక చట్టాలను కొనసాగించాలి
[ 27-07-2024]
కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు. -
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్