అమ్మహస్తం సరకులు.. లబ్ధిదారుల్లో ఆశలు!
చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అందించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థికభారం పడుతోంది.
బియ్యంతోపాటు అందజేయాలని ప్రభుత్వ యోచన
కోటపల్లి మండలం రాపన్పల్లిలో రేషన్ దుకాణంలో వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్
న్యూస్టుడే, చెన్నూరు గ్రామీణం, ఏసీసీ: చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అందించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థికభారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పౌరసరఫరాల, మార్కెటింగ్ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్కార్డుల జారీతో పాటు బియ్యం, తొమ్మిది రకాల సరకుల పంపిణీ అంశంపై చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి నివేదిక కోరినట్లు సమాచారం. ఈ అంశం కార్యరూపం దాల్చితే ఉమ్మడి జిల్లాలోని పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు అందే అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో 1,505 చౌకధరల దుకాణాలు ఉండగా 7,60,627 తెల్లకార్డులున్నాయి. వీరికి ప్రతినెల బియ్యం మాత్రమే అందజేస్తున్నారు.
తెరపైకి తొమ్మిది రకాల వస్తువులు
రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రూపాయికి కిలో బియ్యం కరోనా తర్వాత ఉచితంగా అందిస్తున్నారు. బియ్యంతో పాటు పప్పు, నూనె, కారంపొడి, చింతపండు, పసుపు, ఉల్లిగడ్డ, చక్కెర, ఉప్పు వంటి సరకులను కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగాది సందర్భంగా అమ్మహస్తం పేరిట నిత్యావసర సరకుల పంపిణీని ప్రారంభించారు. ఆ సమయంలో తక్కువ ధరకు బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లిగడ్డలు, వంటనూనె, కారంపొడి, ఉప్పు, చింతపండు, చక్కెర, పసుపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలా పంపిణీ చేసిన సరకులు పేద కుటుంబాలకు ఎంతో ఉపకరించేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మహస్తం పథకాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బియ్యం మాత్రమే అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మార్కెట్లో కొనుగోలు చేయడంతో పేదలపై ఆర్థికభారం పడుతోంది.
తగ్గనున్న ఆర్థిక భారం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగానే తిరిగి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని భావిస్తోంది. తద్వారా నిరుపేదలపై ఆర్థికభారం పడకుండా ఉంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని పునః ప్రారంభానికి అనవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బియ్యంతో పాటు గోధుమలు, కూడా పంపిణీ చేసేవారు. నిత్యావసరాలతో పాటు ఇంకా ఏమైనా పంపిణీ చేయవచ్చా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. రేషన్దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తే పేదలకు ఆర్థికభారం చాలావరకు తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?