సౌకర్యాలు సరే.. బోధకులేరి?
జిల్లాలో ఒకవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సమస్యగా మారనుంది. బడుల పునఃప్రారంభానికి ఇంకా పక్షం రోజులే గడువు ఉండటం..
సర్కారు బడుల్లో వేధిస్తున్న టీచర్ల కొరత
పాలనాప్రాంగణం, న్యూస్టుడే : జిల్లాలో ఒకవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సమస్యగా మారనుంది. బడుల పునఃప్రారంభానికి ఇంకా పక్షం రోజులే గడువు ఉండటం.. బోధకుల కొరతను తీర్చేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు ఎప్పటి మాదిరిగానే తిప్పలు తప్పేలా లేవు.
జిల్లాలో 648 పాఠశాలలు ఉండగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 2,423 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సర్కారు బడుల బాగు కోసం నడుం బిగించింది. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టింది. జిల్లాకు రూ.30 కోట్లు కేటాయించింది. దాదాపు పనులు తుది అంకానికి చేరుకున్నాయి. విద్యార్థులు పాఠశాలలు అడుగుపెట్టేనాటికి ఆహ్లాదకర వాతావరణం, ఆకర్షించేలా రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. అయితే జిల్లాలో విద్యార్థులకు బోధించేవారే లేక చదువులు చతికిలపడుతున్నాయి.
818 మంది అనుత్తీర్ణులయ్యారు..
కిందటి విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో 818 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ఇందులో బోధకుల కొరత ఉన్న సర్కారు బడుల్లో చదివే విద్యార్థులే అత్యధికులు ఉండటం గమనార్హం. తెలుగు, ఆంగ్లం సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యధికులు ఫెయిల్ కావడం బోధకుల కొరత తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగులో 322 మంది, హిందీలో 43 మంది, ఆంగ్లంలో 306 మంది, గణితంలో 189 మంది, సైన్సులో 243 మంది, సోషల్ సబ్జెక్టులో 96 మంది అనుత్తీర్ణులయ్యారు.
ప్రత్యామ్నాయ చర్యలు కరవు
కొత్త ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు ముందుకొచ్చినా.. ఎన్నికల పుణ్యమాని ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా విద్యావాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గత ప్రభుత్వం మాదిరి సర్దుబాటు ప్రక్రియ కొనసాగిస్తారా? లేదా? అన్నది తేలలేదు. పీజీహెచ్ఎం పదోన్నతులతో స్కూల్ అసిస్టెంటు పోస్టులు ఖాళీగా మారాయి. పదోతరగతి విద్యార్థులకు బోధించేవారు కరవయ్యారు.
రూ.6.60 లక్షలు ఖర్చు చేసి..: భీంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ, మూత్రశాలలు, తాగునీరు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.6.60 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఇక్కడ కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో హెచ్ఎం శిల్ప ఇప్పటికే బదిలీ అయి రిలీవర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వెళ్తే ఇద్దరు మిగులుతారు. ప్రధానమైన గణితం, సైన్సు, సోషల్, తెలుగు సబ్జెక్టులను బోధించేవారు లేరు. విద్యావాలంటీర్లు లేక మూడేళ్లుగా వేరే పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.
రెండు తరగతులను ఒకే గదిలో..: బోధకుల కొరత కారణంగా భీంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో రెండు తరగతుల విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక తరగతికి పాఠం చెబుతుండగా, మరోతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
ప్రణీత, డీఈవో
విద్యావాలంటీర్ల నియామకానికి సంబంధించి మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. సర్దుబాటు విషయంలోనూ సమాచారం ఇంకా రాలేదు. ప్రభుత్వ ఆదేశాలను బట్టి బడుల్లో బోధకుల కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ