logo

Adilabad: గుర్తుతెలియని మృతదేహం రిమ్స్‌లో భద్రం

గుర్తుతెలియని మృత దేహాన్ని రిమ్స్‌లో భద్రపరిచినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ తొడసం చందు తెలిపారు.

Published : 28 May 2024 19:30 IST

ఎదులాపురం: గుర్తుతెలియని మృత దేహాన్ని రిమ్స్‌లో భద్రపరిచినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ తొడసం చందు తెలిపారు. దాదాపు 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని అంబులెన్స్ సిబ్బంది ఈనెల 25న అర్ధరాత్రి సమయంలో రిమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించారని, అప్పటికి అతను స్పృహ లేకుండా ఉన్నాడన్నారు. తక్షణ చికిత్స అందించే సమయంలోనే మృతి చెందాడని తెలిపారు. అతనికి సంబంధించిన వారెవరు తోడు లేకపోవడంతో మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. సంబంధికులు ఎవరైనా గుర్తిస్తే రెండో పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు