logo

Adilabad: ఎమ్మెల్యే కేఆర్‌కే కాలనీ సందర్శన

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం పట్టణంలోని కేఆర్‌కే కాలనీ సందర్శించారు.

Updated : 27 May 2024 16:25 IST

అదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం పట్టణంలోని కేఆర్‌కే కాలనీ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కాలనీలో మరమ్మత్తులు చేపడుతున్న నీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు. అంతకుముందు బస్తీ దవఖానను ఎమ్మెల్యే సందర్శించారు.  రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలపై అరా తీశారు. అనంతరం సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఎమ్మెల్యే వెంట భాజపా నాయకులు చిక్కాల దత్తు, సాయి, రాజు, రేఖ, ముకుంద్, గంగుబాయి, అనిల్ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని