ఓటర్ల నిరాసక్తత
ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు.
జిల్లాలో తగ్గిన పోలింగ్
ఓటు వేయండంటూ గ్రామస్థులతో మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి కిశోర్కుమార్
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు. చాలామంది ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నిర్మల్ జిల్లా పరిధిలో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ప్రజల్లో చైతన్యం పెరిగినట్లే కనిపించినా.. అది క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటమవ్వలేదు. ఓటింగ్గా మారలేదు.
అంతటా అదే పరిస్థితి..
జిల్లాలోని చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో ఈసారి జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ కూడా నమోదవకపోవడం గమనార్హం. జిల్లా పరిధిలో పురుషులు 3,50,509 కాగా, మహిళలు 3,72,829, ఇతరులు 51 మంది చొప్పున మొత్తం 7,23,389 ఓటర్లున్నారు. మొత్తంగా 78 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అంటే.. దాదాపు 5.64 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలలో ప్రతీ ఓటు కీలకం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బాధ్యతను విస్మరించొద్దనే ప్రచారం జోరుగా జరిగింది. అయినా.. మూడు నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది.
పట్టణవాసుల్లో అలసత్వం..
దాదాపు రెండు నెలలుగా అధికారులు ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులకున్న బృహత్తరమైన బాధ్యత ఓటు. జాబితాలో పేరున్నవారంతా సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండినవారంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. చాలామంది ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓటు పొందినవారు వేయడానికి బద్ధకించారు. జిల్లా పరిధిలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో ఉన్న ఓటర్లలోనే ఈ అలసత్వం స్పష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, నిరక్షరాస్యులు, వయోవృద్ధులు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటివద్దకే ఓటింగ్ ప్రక్రియను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పట్టణవాసుల్లో ఓటింగ్ ప్రక్రియపై నైరాశ్యం కనిపించింది. ఈ కారణంగానే చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారు. అయితే.. కొత్తగా ఓటు పొందినవారు, ఉద్యోగ- ఉపాధి- విద్యావకాశాల నిమిత్తం దూరప్రాంతాల్లో ఉంటున్నవారిలో కొందరు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్