పల్లె, పట్నం ఓటుకు కదిలె..
మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ముల్కల్ల పోలింగ్ కేంద్రంలో ఓటువేసే సమయం పూర్తయినప్పటికీ వరుసలో నిల్చున్న ఓటర్లు
మంచిర్యాల పట్టణం, బెల్లంపల్లి పట్టణం, చెన్నూరు, చెన్నూరు గ్రామీణం- న్యూస్టుడే: మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించలేదు. పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామాల్లో చాలా చోట్ల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గం ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ ఓటర్ల సరళి పరిశీలించారు. నస్పూరులోని పోలింగ్ కేంద్రంలో జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, కుర్చీలు, తాగునీటి వసతి కల్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
హాజీపూర్ మండలం దొనబండలోని పోలింగ్ కేంద్రంలో బారులుతీరిన ఓటర్లు
మంచిర్యాలలో భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు నడిపెల్లి దివాకర్రావు, ప్రేమ్సాగర్రావు, వెరబెల్లి రఘునాథ్రావు, చెన్నూరు కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు గడ్డం వివేకానంద, దుర్గం అశోక్ ఓట్లు వేశారు. మందమర్రి మండలంలోని క్యాతనపల్లిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, చెన్నూరు భారాస అభ్యర్థి బాల్క సుమన్ ఓట్లు వేశారు. బెల్లంపల్లి నియోజకర్గంలో భారాస, భాజపా అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, శ్రీదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్కు ఓటు హైదరాబాద్లో ఉండటంతో ఇక్కడ తన ఓటు తాను వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
గతంలో కన్నా తగ్గిన పోలింగ్ శాతం
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో గత ఎన్నికల కన్నా ఇప్పుడు పోలింగ్ శాతం తగ్గింది. 2018 నుంచి 2023 ఎన్నికల మధ్యలో ఓటర్ల నమోదు సంఖ్య భారీగా పెరిగింది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగిన ఇప్పుడు పోలింగ్ శాతం తక్కువ నమోదైంది. గతంలో లాగానే ఈసారి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ నమోదు తగ్గినట్టు తెలుస్తోంది.
పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఈవీఎం యంత్రాలతో తరలివెళ్తున్న ఎన్నికల సిబ్బంది
మంచిర్యాలలోని అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఓటు కోసం బారులు తీరిన స్థానికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?