నిండుగా.. ఓట్ల పండగ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ప్రశాంతంగా ముగిసిన ప్రజాస్వామ్య క్రతువు..
వడ్గాంలో బారులు తీరి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటననలు మినహా ఎక్కడా పోలింగ్కు ఆటంకం కలగలేదు. దారిలేని గూడాలు..మారుమూల ప్రాంతాలు.. పట్టణాల నుంచి జనం ఓటుకోసం పోటెత్తారు. బాలింతలు,గర్భిణులు,వికలాంగుసైతం తమ అసహాయతను పక్కనబెట్టి అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ప్రక్రియ సమయం గడిచేకొద్దీ ఊపందుకుంది. కొన్నిచోట్ల రాత్రివరకు కూడా వేచిఉండి తమహక్కును వినియోగించారు. అధికార యంత్రాంగం, భద్రతాసిబ్బంది అలుపులేకుండా తమ విధులు నిర్వర్తించారు..
రెండు చేతుల్లేకపోయినా..!
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నరేశ్. నిర్మల్ పట్టణానికి చెందిన ఈయన గతంలో జరిగిన ఓ విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు (మణికట్టు భాగం వరకు) కోల్పోయాడు. ఈయన గురువారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తన బాధ్యతను నిర్వర్తించాడు. బుధవార్పేట్ విధాత పాఠశాలలోని పోలింగ్బూత్ 201లో ఆయన పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చాలామంది ఓటేయడానికి బద్ధకించారు. అలాంటివారికి ఈయన స్ఫూర్తిగా నిలిచారు.
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మార్కెట్ ఏరియాలోని పోలింగ్ బూత్లో ఉదయం విద్యుత్తు అంతరాయం కారణంగా సిబ్బంది ఓటర్లు ఇబ్బంది పడ్డారు. సెల్ఫోన్ల టార్చ్లైట్లో ప్రక్రియ కొనసాగించారు.
వందేళ్లు దాటినా..
ఉట్నూరు మండలం లక్కారంలో నివాసం ఉంటున్న దూట రాజవ్వకు 103 సంవత్సరాలు. తాను ఎలాగైనా ఓటేస్తానని తన కొడుకు దూట మహేందర్ను కోరగా ఆయన ఆటోలో తీసుకొచ్చి పోలింగ్ కేంద్రం వరకూ ఎత్తుకొచ్చి ఓటు వేయించారన్నారు. తనకు ఓటేయడం ఆనందంగా ఉందని అవ్వ నవ్వుతూ తెలిపారు.
ఓటేసేందుకు స్వగ్రామాలకు తరలిరావడంతో కిక్కిరిసిన ఆదిలాబాద్ ప్రయాణ ప్రాంగణం
ఎడ్లబండిలో 3 కిలోమీటర్ల దూరంలోని అంబుగామ్ కేంద్రానికి వెళ్తున్న వామన్నగర్ సీతారాం కుటుంబీకులు
ఆదిలాబాద్ : కలెక్టర్ రాహుల్రాజ్, శ్రీజ దంపతులు
మామడ: ఓటు హక్కు వినియోగించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి రావు, కుమార్తె డా.స్నేహ
నస్పూరులో ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న పాలనాధికారి బదావత్ సంతోష్ దంపతులు
ఆసిఫాబాద్ జన్కాపూర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కుమురం భీం కలెక్టర్ దంపతులు హేమంత్ బోర్కడే, రేవతి
ఆదిలాబాద్ : ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
చెన్నూరు : పొక్కూరులో పసిపాపతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ
తాంసిలో అయ్యప్ప స్వాములు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?