అవకాశం కోసం ఆగాల్సిందే
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నేతలు నిరీక్షించాల్సిందే. దిల్లీ స్థాయిలో ప్రేమ్సాగర్రావు, గడ్డం సోదరులు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మొదటివిడతలో మొండి చేయి..
మంత్రివర్గంలో చోటుకోసం పీఎస్ఆర్, గడ్డం సోదరుల యత్నాలు
ఈటీవీ - ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నేతలు నిరీక్షించాల్సిందే. దిల్లీ స్థాయిలో ప్రేమ్సాగర్రావు, గడ్డం సోదరులు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్,వివేక్ సోదరులు ఇప్పటికే దేశ రాజధానిలో అఖిల భారత కాంగ్రెస్(ఏఐసీసీ) అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. దాదాపుగా దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్నందున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా కల్పించాలంటే మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేననే నిర్ణయానికి పరిశీలకుల బృందం వచ్చింది. అదే సమయంలో ప్రేమ్సాగర్రావు, గడ్డం వర్గాలను నిరాశకు గురిచేయకూడదనే ఆలోచన చేస్తోంది. ఫలితంగానే మొదటి విడతలో ఎవరికీ అవకాశం రాలేదు. త్వరలోనే రెండో విడత విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఈలోగా ఇరువర్గాలతో చర్చించి సముచిత స్థానం కల్పించాలనే భావనలో పార్టీ ఉంది. ప్రేమ్సాగర్రావు, వినోద్, వివేక్ విజయం సాధించిన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాధాన్యాన్ని గుర్తించాలని కాంగ్రెస్ కీలక నేతల ఆలోచనగా కొనసాగుతోంది. ఖానాపూర్నుంచి విజయం సాధించిన వెడ్మ బొజ్జును మినహాయిస్తే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజకీయాలను ప్రభావితం చేయగలిగే సమర్థులే అనే ఆలోచన సైతం పార్టీలో చర్చకు వచ్చింది. పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుంటే వివేక్ పార్టీ మారినా వినోద్ 2018లో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలవడం మినహా పార్టీలోనే ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది. ప్రేమ్సాగర్రావు మాత్రం ఆది నుంచి పార్టీలోనే ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా హవా కొనసాగుతున్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు జవసత్వాలు తీసుకురావడంలో ప్రేమ్సాగర్రావు పాత్ర ఉన్నట్లుగా రాష్ట్రంలోని కొంతమంది కీలక నేతలు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ప్రభుత్వం కొలువుదీరడంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల నిర్ణయంతో తప్పకుండా ఒకరికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి పరిశీలకుల బృందం వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే