నిర్వహణ కొరవడి.. పొగబారిన పడి..
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామాల్లో వెలువడే చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు డంపింగ్ యార్డులు, సేంద్రియ ఎరువుల తయారీ పథకాలకు శ్రీకారం చుట్టింది.
చెత్తకు కాల్చుతుండటంతో పెరుగుతున్న కాలుష్యం..
కాగజ్నగర్, న్యూస్టుడే: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామాల్లో వెలువడే చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు డంపింగ్ యార్డులు, సేంద్రియ ఎరువుల తయారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈమేరకు పల్లెలు, పట్టణాల్లో ఆగమేఘాల మీద నిర్మాణాలు పూర్తి చేయించారు. కానీ వినియోగంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ తంతు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, కాగజ్నగర్ పురపాలికలో 30 వార్డులు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో డంపింగ్యార్డు నిర్మాణం కోసం రూ.2.50 లక్షలు చొప్పున నిదులు కేటాయించగా.. నిర్మాణాలు పూర్తి చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ కోసం రెండేసి చొప్పున ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేశారు. దీంతోపాటు ప్రతి పంచాయతీకి చెత్త తరలించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. నిత్యం తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి దాన్ని డంపింగ్యార్డుకు తీసుకెళ్లి.. తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారైన ఎరువును పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు వాడాలి. పొడి చెత్తలో ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించి ఆ డబ్బులను పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నిండా నిర్లక్ష్యం..
తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు పంచాయతీ ప్రత్యేక నిధులతో వానపాములను కొనుగోలు చేయించారు. వాటిని వినియోగించి ఎరువు తయారు చేయాలి. అయితే నిర్వహణ లేక చాలా వరకు నిరుపయోగంగా మారాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించక పోవడం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించక పోవడంతో.. మొత్తం చెత్తను ట్రాక్టర్లలో సేకరించి డంపింగ్యార్డుకు తీసుకెళ్లి సమీపంలోనే పడేస్తున్నారు. చాలావరకు గ్రామాల్లో యార్డులు నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను సమీపంలో పడేయడం తర్వాత నిప్పుపెడుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది. నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు.
పురపాలికలో ఇలా..
కాగజ్నగర్ పురపాలికలోని 30 వార్డులు ఉండగా.. ప్రతి రోజు దాదాపు 20 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. 152 మంది పారిశుద్ధ్య కార్మికులు 15 ఆటో ట్రాలీలు, 5 ట్రాక్టర్లతో పట్టణ శివారులోని కాగజ్నగర్ మండలం కోసిని, సర్సిల్క్ ఏరియాల్లోని డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. సర్సిల్క్ ఏరియాలో చెత్తతో ఎరువు తయారీకి రూ.కోటి వ్యయంతో రెండేళ్లగా షెడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతో చెత్తకు నిప్పంటిస్తున్నారు.
నిర్మాణ పనులు సాగుతూ..
కాగజ్నగర్ పురపాలిక పరిధిలోని సర్సిల్క్ ఏరియాలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేకంగా రూ.కోటి నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల కిందట షెడ్డు నిర్మాణ పనులు చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఫలితంగా పట్టణంలోని చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డులకు తరలించి నిప్పంటిస్తున్నారు. వెలువడే పొగ కారణంగా కాలుష్యం పెరుగుతోంది.
నిరుపయోగంగా..
కాగజ్నగర్ మండలంలోని కోసిని గ్రామ పంచాయతీ సమీపంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టారు. అయితే వినియోగించడం లేదు. దాని సమీపంలోనే చెత్తాచెదారాన్ని పడేస్తున్నారు. దీంతోపాటు చింతగూడలోని డంపింగ్యార్డు రేకుల షెడ్డు.. ఇటీవలి గాలులకు కూలిపోయింది. దీంతో గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని యార్డు సమీపంలోనే ఇష్టానుసారంగా పడేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.